ముగిసిన ‘మహా’ డ్రామా.. ప్రమాణస్వీకారం చేస్తోన్న ఎమ్మెల్యేలు
కొన్ని రోజులుగా గంటకో ట్విస్ట్తో ఆసక్తికరంగా కొనసాగిన మహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్స్కు చేరుకున్నాయి. ఎన్పీసీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా వికాస్ అఘాడీ’ నేతగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. మూడు పార్టీల ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు ముంబయిలోని ట్రైడెంట్ హోటల్లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ శాసనసభాపక్షనేత జయంతిపాటిల్, ఉద్ధవ్ పేరును ప్రతిపాదించగా… కాంగ్రెస్ సభ్యుడు బాలా సాహెబ్ థోరట్ […]
కొన్ని రోజులుగా గంటకో ట్విస్ట్తో ఆసక్తికరంగా కొనసాగిన మహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్స్కు చేరుకున్నాయి. ఎన్పీసీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా వికాస్ అఘాడీ’ నేతగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. మూడు పార్టీల ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు ముంబయిలోని ట్రైడెంట్ హోటల్లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ శాసనసభాపక్షనేత జయంతిపాటిల్, ఉద్ధవ్ పేరును ప్రతిపాదించగా… కాంగ్రెస్ సభ్యుడు బాలా సాహెబ్ థోరట్ బలపర్చారు. ఈ నేపథ్యంలో నవంబర్ 28న ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా ప్రస్తుతం ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కొలంబకర్ ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్సీపీ ఎమ్మెల్యేలలో కలిసి అజిత్ పవార్ అసెంబ్లీకి వచ్చారు. ఇక శాసనసభ వద్ద అజిత్ పవార్ను శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ నేత సుప్రియా సూలే ఆప్యాయ ఆలింగనం చేసుకున్నారు. కాగా ఫడ్నవీస్ రాజీనామా చేసిన నేపథ్యంలో బల పరీక్ష అవసరం లేదని విధాన భవన్ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
Mumbai: NCP leaders Ajit Pawar & Supriya Sule arrive at the assembly, ahead of the first session of the new assembly today. Oath will be administered to the MLAs in the assembly today. #Maharashtra pic.twitter.com/lyGtcCunif
— ANI (@ANI) November 27, 2019