AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మానవ మృగాలు.. 14ఏళ్ల బాలుడిని ఎడ్ల బండికి కట్టేసి.. దారుణంగా..

మహారాష్ట్ర ధూలేలో మానవత్వాన్ని మరిచిన దారుణం వెలుగుచూసింది. ట్రాక్టర్ లైట్ దొంగతనం ఆరోపణపై 14 ఏళ్ల మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టి, నిప్పు అంటించారు. తీవ్రంగా కాలిపోయిన ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు.

మానవ మృగాలు.. 14ఏళ్ల బాలుడిని ఎడ్ల బండికి కట్టేసి.. దారుణంగా..
Minor Boy Tortured Tractor Light Theft
Krishna S
|

Updated on: Nov 23, 2025 | 7:35 AM

Share

మానవత్వం మరచి దారుణంగా ప్రవర్తించిన షాకింగ్ సంఘటన మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో వెలుగు చూసింది. ట్రాక్టర్ లైట్ దొంగిలించాడనే అనుమానంతో 14 ఏళ్ల మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి, హింసించి, చివరికి నిప్పు అంటించిన అత్యంత అమానుష ఘటన శిర్పూర్ తాలూకాలో జరిగింది. ప్రస్తుతం తీవ్రంగా కాలిపోయిన ఆ బాలుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అసలేం జరిగింది?

ఈ దారుణం శిర్పూర్ నియోజకవర్గంలోని జలోద్ రోడ్డు సమీపంలో ఉన్న భాంపూర్ పొలంలో, ఒక ఇటుక బట్టీ వద్ద జరిగింది. బాధితుడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. అతని తండ్రి ఫిర్యాదు ప్రకారం.. చింతమన్ అలియాస్ చింటు, సచిన్ అనే ఇద్దరు వ్యక్తులు బాలుడిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. కిడ్నాప్ చేసిన తర్వాత నిందితులు బాలుడిని పొలంలోని ఇటుక బట్టీ వద్దకు తీసుకెళ్లి కొట్టారు. అనంతరం అతడిని ఇనుప ఎద్దుల బండికి గట్టిగా కట్టేశారు. ఈ దారుణం అక్కడితో ఆగకుండా అనుమానితులు ఎద్దుల బండి కింద నిప్పు పెట్టారు. బండికి నిప్పంటించడం వల్ల, ఇనుప షీట్ తీవ్రంగా వేడెక్కింది. దీని ఫలితంగా హిమాన్షు శరీరం తీవ్రంగా కాలిపోయింది.

నిందితుల అరెస్ట్

గాయపడిన బాలుడు ఏదో విధంగా తప్పించుకుని ఇంటికి చేరుకుని, జరిగినదంతా తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే గాయపడిన హిమాన్షును శిర్పూర్ కాటేజ్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై శిర్పూర్ నగర పోలీసులు వెంటనే స్పందించారు. నిందితులు చింతమన్ కోలి, సచిన్ కోలిలపై కిడ్నాప్, దాడి, చంపడానికి ప్రయత్నించినందుకు బాలల రక్షణ చట్టం కింద తీవ్రమైన కేసులు నమోదు చేశారు. పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ అమానుష ఘటన ధూలే జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us