ప్రధాని మోదీతో సమావేశానికి 8 పార్టీలకు ఆహ్వానం…….మెహబూబ్ ముప్తీ బదులు ఫరూక్ అబ్దుల్లా హాజరు

జమ్మూ కాశ్మీర్ పై ప్రధాని మోదీ ఈ నెల 24 న నిర్వహించనున్న అఖిల పక్ష సమావేశానికి హాజరు కావాలని 8 పార్టీలకు ఆహ్వానం అందింది. తనకు లాంఛనంగా కాల్ అందినప్పటికీ..

ప్రధాని మోదీతో సమావేశానికి 8 పార్టీలకు ఆహ్వానం.......మెహబూబ్ ముప్తీ బదులు ఫరూక్ అబ్దుల్లా హాజరు
Narendra Modi
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 20, 2021 | 12:39 PM

జమ్మూ కాశ్మీర్ పై ప్రధాని మోదీ ఈ నెల 24 న నిర్వహించనున్న అఖిల పక్ష సమావేశానికి హాజరు కావాలని 8 పార్టీలకు ఆహ్వానం అందింది. తనకు లాంఛనంగా కాల్ అందినప్పటికీ.. తుది నిర్ణయం తీసుకోలేదని, తన బదులు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ఈ మీటింగ్ లో పాల్గొంటారని మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముప్తీ తెలిపారు. అయినా తమ పార్టీ నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని ఆమె చెప్పారు. 8 పార్టీల నుంచి 16 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశాలున్నాయి. ఇదివరకటి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి చివరి సీఎం అయిన మెహబూబా ముప్తీ 2016 నుంచి 2018 వరకు బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలో కొనసాగారు. ఢిల్లీలో ప్రధానితో జరిగే సమావేశానికి హాజరయ్యే విషయమై తమలో తాము చర్చించుకుంటామని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు వెల్లడించారు. ఇక బీజేపీతో బాటు జమ్మూ కాశ్మీర్ అప్ని పార్టీ తాము హాజరవుతామని ప్రకటించాయి. జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణకు గల అవకాశాలపై చర్చించేందుకు మోదీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

సుమారు రెండేళ్ల క్రితం.. కాశ్మీర్ కి స్వయంప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని కేంద్రం రద్దు చేసి.. దాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీంతో అప్పట్లో ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. పర్యవసానంగా ప్రభుత్వం ప్రధాన పార్టీల నాయకులకు గృహ నిర్బంధం విధించింది. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముప్తీ వంటి అనేకమంది గృహ నిర్బంధంలో ఉంటూ వచ్చారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Telangana Crime News: పైకి మామ‌డి పండ్ల లోడే.. లోప‌ల చెక్ చేసి ఖంగుతిన్న పోలీసులు

Telangana Crime News: పైకి మామ‌డి పండ్ల లోడే.. లోప‌ల చెక్ చేసి ఖంగుతిన్న పోలీసులు

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు