సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుంది. ఔషధాల ధరల భారాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా క్యాన్సర్, టీబీ, షుగర్ వ్యాధుల నివారణకు ఉపయోగించే 39 రకాల మందులు, టీకాల ధరలు త్వరలోనే తగ్గనున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ అత్యవసర ఔషధాల జాబితా(ఎన్ఎల్ఈఎం)ను కేంద్ర వైద్యారోగ్య శాఖ సవరించింది. ఈ లిస్టులో చేర్చిన మందుల ధరలను జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ(ఎన్పీపీఏ) నిర్ణయించనుంది.
జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలోకి 39 ఔషధాలను చేర్చడంతో పాటు.. మరో 16 ఔషధాలను ఆ లిస్టును తొలగించాలని కేంద్రం ప్రతిపాదించనుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గేందుకు ఉపయోగించే ఔషధాలు తొలగించే లిస్టులో ఉన్నాయని సమాచారం. వివిధ రకాల కారణాల వల్ల వీటిని ఎన్ఎల్ఈఎం నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
Also Read: 11 ఏళ్ల కెరీర్లో 11 వికెట్లు కూడా తీయలేదు.. చెత్త బౌలింగ్కు ఇతడే నిదర్శనం.. ఎవరో తెలుసా!
ఓవైపు వ్యాపారం.. మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్న ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.?
ట్రై యాంగిల్ లవ్స్టోరీ.. వివాహానికి లాటరీ పద్దతిలో యువతి ఎంపిక.. చివరకు..
టాలీవుడ్లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా…?