AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో ఏంటి ఈ దారుణం.. భార్యపై యాసిడ్ పోసిన భర్త

తమిళనాడులోని కోయంబత్తూర్ లో దారుణం చోటుచేసుకుంది. భార్య పైనే భర్త యాసిడ్ పోసిన ఘటన వెలుగు చూసింది. కోయంబత్తూర్ లోని రామంతపూరంలో కవిత (33) అనే మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. తన భర్త శివ (40) ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేంది.

వామ్మో ఏంటి ఈ దారుణం.. భార్యపై యాసిడ్ పోసిన భర్త
Acid Attack
Follow us
Aravind B

|

Updated on: Mar 24, 2023 | 9:32 AM

తమిళనాడులోని కోయంబత్తూర్ లో దారుణం చోటుచేసుకుంది. భార్య పైనే భర్త యాసిడ్ పోసిన ఘటన వెలుగు చూసింది. కోయంబత్తూర్ లోని రామంతపూరంలో కవిత (33) అనే మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. తన భర్త శివ (40) ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేంది. అయితే 2016 లో కవిత ఓ బస్ ప్రయాణికురాలి నుంచి చైను దొంగతనం చేసిన కేసులో అరెస్టు అయ్యింది. ఈ తర్వాత ఆమె బెయిల్ పై విడుదలయ్యింది. కానీ ఆమె కోర్టుల్లో ఆ కేసుపై విచారణకు వచ్చేది. అలాగే తన భర్తతో కూడా తరచూ గొడవపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఆమెకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.  దీంతో వారం క్రితమే తన భర్త, పిల్లలు ఉంటున్న ఇంట్లో నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటోంది. అయితే తాజాగా గురువారం రోజు కవిత ఆ కేసు విచారణకు సంబంధిచి కోయంబత్తూర్ జ్యూడీషల్ మెజిస్ట్రేట్ కి వచ్చింది.

విచారణ కోసం ఆ కోర్టులో ఆమె ఎదురుచూస్తుండగా అక్కడికి తన భర్త శివ కూడా వచ్చాడు. దీంతో ఇద్దరికీ మరోసారి వాగ్వాదం జరిగింది. శివతో తనతో పాటు ఓ యాసిడ్ బాటిల్ ను కూడా తీసుకొచ్చాడు కాని దాన్ని తన భార్యకు కనిపించకుండా దాచిపెట్టాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుండా కోపంతో రగిలిపోయిన శివ ఒక్కసారిగా తనపై యాసిడ్ ను పోసేశాడు. ఆ తర్వాత శివ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ అతడ్ని లాయర్లు పట్టుకని పోలీసులకు అప్పగించారు. ఇక యాసిడ్ దాడిలో కవిత తీవ్ర గాయలుపాలైంది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 13 న అదే కోర్టు ప్రాంగణంలో ఓ గ్యాంగ్ వచ్చి ఓ వ్యక్తి నరికి హత్య చేసిన ఘటన చోటుచేసకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..