AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంబులెన్స్‌కు డ‌బ్బులు ఇవ్వలేక సంచిలో కొడుకు మృత దేహం…బస్సులో 200కి.మీ ప్ర‌యాణం..

అంత డబ్బు అతని వద్ద లేకపోవడంతో చేసేదేమీ లేక చిన్నారి మృతదేహంతో బస్టాండ్‌కు పయనమయ్యాడు. మృతదేహాన్ని బ్యాగ్‌లో దాచి సుమారు 200 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి కలియాగంజ్‌ చేరుకున్నాడు. అక్కడి నుంచి అంబులెన్స్‌ మాట్లాడుకుని ఇంటికి చేరుకున్నాడు.

అంబులెన్స్‌కు డ‌బ్బులు ఇవ్వలేక సంచిలో కొడుకు మృత దేహం...బస్సులో 200కి.మీ ప్ర‌యాణం..
Man Carried The Body
Jyothi Gadda
|

Updated on: May 16, 2023 | 11:00 AM

Share

కొడుకు కర్మకాండలు జరిపించేందుకు డబ్బులు లేక మృతదేహాన్ని ముక్కలుగా నరికి పడవేసేందుకు ప్రయత్నించింది ఒక కుటుంబం. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలో చోటు చేసుకోగా, నలుదిశలా సంచలనం రేపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన మరో విషాద సంఘటన ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది. అంబులెన్స్ కు డబ్బులు ఇవ్వలేక ఓ తండ్రి తన కొడుకు మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని సుమారు 200 కిలోమీటర్లు బస్సులోనే ప్రయాణించాడు. ఈ అమానవీయ సంఘటన పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివ‌రాల‌లోకి వెళితే..

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని కలియాగంజ్ ప్రాంతానికి చెందిన అసిమ్‌ దేవశర్మకి ఐదు నెలల వయసు ఉన్న కవల పిల్లలు ఉన్నారు. ఇటీవల ఇద్దరు పిల్లలూ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కలియాగంజ్‌ జనరల్‌ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించాడు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆ చిన్నారులను సిలిగురిలోని ఉత్తర బెంగాల్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరి ఆరోగ్యం కాస్త కుదుటపడింది. దీంతో ఆ బిడ్డను దేవశర్మ భార్య ఇంటికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో అక్కడే చికిత్స పొందుతున్న మరో కుమారుడు గత శనివారం రాత్రి ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బిడ్డ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాలని దేవశర్మ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అంబులెన్స్‌ కోసం వెళ్లగా డ్రైవర్లు రూ.8 వేలు డిమాండ్‌ చేశారు. అంత డబ్బు అతని వద్ద లేకపోవడంతో చేసేదేమీ లేక చిన్నారి మృతదేహంతో బస్టాండ్‌కు పయనమయ్యాడు. మృతదేహాన్ని బ్యాగ్‌లో దాచి సుమారు 200 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి కలియాగంజ్‌ చేరుకున్నాడు. అక్కడి నుంచి అంబులెన్స్‌ మాట్లాడుకుని ఇంటికి చేరుకున్నాడు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. విషయం తెలిసిన నెటిజన్లు ఆ తండ్రి దయనీయ స్థితి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జరిగిన ఘటనపై పలు విపక్ష పార్టీలు సైతం స్పందిస్తూ, ప్రభుత్వ తీరుపై పలు విమర్శలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..

Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..