AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. రాష్ట్రంలో కేసుల పెరుగుదలపై ఏమన్నారంటే..?

CM Uddhav Thackeray receives Corona vaccine: దేశవ్యాప్తంగా కోవిడ్‌ -19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. దీంతో అర్హత కలిగిన సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు..

COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. రాష్ట్రంలో కేసుల పెరుగుదలపై ఏమన్నారంటే..?
CM Uddhav Thackeray receives Corona vaccine
Shaik Madar Saheb
|

Updated on: Mar 11, 2021 | 2:57 PM

Share

CM Uddhav Thackeray receives Corona vaccine: దేశవ్యాప్తంగా కోవిడ్‌ -19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. దీంతో అర్హత కలిగిన సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు సైతం వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే సైతం కోవిడ్ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. గురువారం ముంబైలోని జేజే ఆసుపత్రిలో ఠాక్రే కరోనా వ్యాక్సిన్‌ తొలిడోసు తీసుకున్నారు. ఆయనతోపాటు ఆయన భార్య , తల్లి కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. భారత్ బయోటెక్ తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్‌ను ఠాక్రే తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. వ్యాక్సిన్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. కేసులు పెరుగుతుండటంతో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ఉద్ధవ్ తెలిపారు. పరిస్థితి అదుపులోకి రాలేదని ఉద్ధవ్ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. మహారాష్ట్రలో కరోనావైరస్‌ కేసులు మళ్లీ విజృంభిస్తుండటంతో ఆందోళన నెలకొంది. బుధవారం రాష్ట్రంలో ఏకంగా 13,659 కేసులు నమోదయ్యాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా నాగపూర్‌ నగరంలో సైతం ఆంక్షలు విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలాఉంటే.. దేశ‌వ్యాప్తంగా కరోనావ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 2,52,89,693 కి చేరినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. గ‌త 24 గంట‌ల్లో 9.2 లక్షల మందికి టీకా పంపిణీ చేసినట్లు పేర్కొంది. ముందుగా జనవరి 16 నుంచి వ్యాక్సిన్‌ను ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి పంపిణీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 1నుంచి 60ఏళ్లు పైబడిన వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైన వారికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు.

Also Read: Lockdown: మళ్లీ లాక్‌డౌన్‌.. కీలక ఆదేశాలు జారీ చేసిన అధికారులు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ