AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: హైవేపై బస్సును ఢీకొట్టిన ట్రక్.. ఏడుగురు దుర్మరణం.. 13 మందికి గాయాలు..

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతి చెందగా, పదమూడు మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Road Accident: హైవేపై బస్సును ఢీకొట్టిన ట్రక్.. ఏడుగురు దుర్మరణం.. 13 మందికి గాయాలు..
Accident
Shaik Madar Saheb
|

Updated on: May 23, 2023 | 1:39 PM

Share

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతి చెందగా, పదమూడు మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధాని ముంబైకి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుల్దానా జిల్లాలోని పాత ముంబై-నాగ్‌పూర్ హైవేపై సింధ్‌ఖేడ్ రాజా పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్‌టిసి)కి చెందిన బస్సు పూణె నుండి మెహకర్ (బుల్దానా) వైపు వెళుతోంది. ఈ క్రమంలో ఎదురుగా స్పీడ్‌గా వ‌స్తున్న ట్రక్కు ఆ బ‌స్సును ఢీకొట్టింది. మృతుల్లో నలుగురు బస్సు ప్రయాణికులు, రెండు వాహనాల డ్రైవర్లు ఉన్నారని అధికారి తెలిపారు. గాయపడిన వారిని సింధ్‌ఖేడ్ రాజా పట్టణంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

రెండు వాహ‌నాలు ఎంత వేగంతో ఢీకొన్నాయంటే.. ఆ వెహికిల్స్ తునాతునకలయ్యాయి. బ‌స్సు, ట్రక్కుకు చెందిన గ్లాసు ప్యాన‌ల్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా ప‌డిపోయాయి.. ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. బస్సు లోపల సీట్లు భారీగా దెబ్బతిన్నాయి. అద్దాలు ద్వంసమయ్యాయి.ఘటన స్థలంలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.ప్రమాదస్థలాన్ని బట్టి చూస్తే వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

అమరావతిలో ఐదుగురు మృతి..

ఇదిలాఉంటే.. మహారాష్ట్రలోని అమరావతిలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమరావతిలో ట్రక్కు కారును ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 7 మందికి గాయాలయ్యాయి. అమరావతిలోని ఖల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దరియాపూర్-అంజంగావ్ రహదారిపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..