మూకదాడులతో దిగజారుతున్న దేశ ప్రతిష్ట.. : ఆర్ఎస్ఎస్ చీఫ్

మూకదాడులతో దేశ ప్రతిష్ట దిగజారుతోందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విచారం వ్యక్తం చేశారు. విజయదశమి దసర సందర్భంగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విదేశీ సంస్కృతికి అద్దం పడుతున్న ఈ దాడులు.. హిందూ సమాజానికి చేటు అని అభివర్ణించారు. కొన్ని మతాల మధ్య జరుగుతున్న ఈ దాడులు భయాందోళనలకు కారణమవుతున్నాయని అన్నారు. అయితే కొందరు కావాలనే దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. కులం, మతం, భాష, ప్రాంతాల వైవిధ్యాన్ని […]

మూకదాడులతో దిగజారుతున్న దేశ ప్రతిష్ట.. : ఆర్ఎస్ఎస్ చీఫ్
Follow us

| Edited By:

Updated on: Oct 08, 2019 | 5:06 PM

మూకదాడులతో దేశ ప్రతిష్ట దిగజారుతోందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విచారం వ్యక్తం చేశారు. విజయదశమి దసర సందర్భంగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విదేశీ సంస్కృతికి అద్దం పడుతున్న ఈ దాడులు.. హిందూ సమాజానికి చేటు అని అభివర్ణించారు. కొన్ని మతాల మధ్య జరుగుతున్న ఈ దాడులు భయాందోళనలకు కారణమవుతున్నాయని అన్నారు. అయితే కొందరు కావాలనే దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. కులం, మతం, భాష, ప్రాంతాల వైవిధ్యాన్ని కొందరు స్వప్రయోజనాలకు వాడుకోవడం వల్ల విభేదాలకు ఆజ్యం పోసినట్లవుతుందన్నారు. అలాంటి స్వార్థ శక్తుల కుట్రలను గుర్తించి అప్రమతం కావాలని.. అంతేకాదు అలాంటి శక్తులను తిప్పికొట్టాలని అన్నారు. ప్రతి ఒక్కరు హింసకు తావులేకుండా శాంతియుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు చట్టానికి లోబడి నడుచుకోవాలన్నారు.

గత కొద్ది రోజులుగా “భారతీయత” అనే సిద్ధాంతంపై ప్రజల ఆలోచనా విధానంలో సానుకూలత పెరుగుతోందని.. కానీ, ఈ మార్పును కొన్ని స్వార్థ శక్తులు సహించలేకపోతున్నాయన్నారు. అంతేకాదు దేశ పటిష్ట నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకునే అనేక నిర్ణయాలను ఈ శక్తులు వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు భారత సరిహద్దులు పటిష్ఠంగా ఉన్నాయని.. తీర ప్రాంతాల రక్షణపై మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఈ నిర్ణయంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. దేశ ప్రయోజనాలను పరిరక్షించగలదని నిరూపించిందని.. దీంతో ప్రజల్లో కూడా విశ్వాసం రెట్టింపయ్యిందని భగవత్ అన్నారు. గత నెలన్నర వ్యవధిలో ప్రభుత్వం అనేక ఉద్దీపన చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. అంతకుముందు నాగపూర్‌లోని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆయుధపూజలో భగవత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హెచ్‌సీఎల్‌ సంస్థ వ్యవస్థాపకుడు శివ నాడార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు, నితిన్‌ గడ్కరీ, జనరల్‌ వి.కె.సింగ్‌, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Latest Articles
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేయండి.. ఇక ఆ సమస్య అన్న మాటే ఉండదు..
నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేయండి.. ఇక ఆ సమస్య అన్న మాటే ఉండదు..
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??