AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Election 2024: ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..

దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో మూడో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలో 120 మంది మహిళలు సహా 1,351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గుజరాత్‌లో 26, కర్నాటకలో 14, మహారాష్ట్రలో 11..

Lok Sabha Election 2024: ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
Lok Sabha Election 2024
Shaik Madar Saheb
|

Updated on: May 07, 2024 | 1:27 PM

Share

దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో మూడో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలో 120 మంది మహిళలు సహా 1,351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గుజరాత్‌లో 26, కర్నాటకలో 14, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్‌లో 10, మధ్యప్రదేశ్‌లో 8, ఛత్తీస్‌గఢ్‌లో 7, బీహార్‌లో 5, అస్సాంలో 4, పశ్చిమ బెంగాల్‌లో 4, గోవాలో 2 స్థానాల్లో, దాద్రా నగర్ హవేలీ 1, డామన్ డయ్యు 1 స్థానంలో మూడో దశ పోలింగ్ జరుగుతోంది. అయితే, గుజరాత్లోని సూరత్ నియోజకవర్గం ఒకటి ఏకగ్రీవం కగా.. అక్కడ పోలింగ్ జరగడంలేదు.. ఇదిలాఉంటే.. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఎండ వేడికి జనం అల్లాడుతున్నారు. అయినప్పటికీ.. ఓటు వేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఈక్రమంలో మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ లోక్ సభ పరిధిలోని మహాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి పోలింగ్‌ కేంద్రం సమీపంలోనే మృతి చెందడం ఆందోళన కలిగించింది.

చనిపోయిన ఓటరు పేరు ప్రకాష్ చింకటే. చింకటే మహద్ తాలూకాలోని దభేకర్ కొండ్ (కింజోల్లి బు) నివాసి. దభేకర్‌ కోండ్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసేందుకు ఆయన ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరారు. ఉదయం 9 గంటలకు కాలినడకన పోలింగ్‌ కేంద్రానికి బయలుదేరారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులతో కలిసి ఎంతో ఉత్సాహంతో పోలింగ్ కేంద్రానికి సమీపంలోకి వచ్చారు.

అయితే పోలింగ్‌ బూత్‌కు 100 మీటర్ల దూరంలో ఉండగా ఒక్కసారిగా కళ్లు తిరగడంతో.. అక్కడికక్కడే కుప్పకూలారు. దీంతో అతని సహచరులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయాడని వైద్య అధికారులు నిర్ధారించారు. అప్పటివరకు తమతో ఉన్న సహచరుడు అకస్మాత్తుగా చనిపోవడాన్ని నమ్మలేకపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

కాగా, రాయ్‌గఢ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్‌సీపీకి చెందిన సునీల్ తట్కరే ఠాక్రే గ్రూపునకు చెందిన అనంత్ గీతతో తలపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నీలం రంగు రత్నం ధరిస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
నీలం రంగు రత్నం ధరిస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగం లైవ్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగం లైవ్
ఆస్కార్ గెల్చుకున్న సినిమాలు.. ఇప్పుడు ఈ ఓటీటీల్లో ఫ్రీగా చూడొచ్చ
ఆస్కార్ గెల్చుకున్న సినిమాలు.. ఇప్పుడు ఈ ఓటీటీల్లో ఫ్రీగా చూడొచ్చ
మధ్యాహ్నం నిద్రపోతే శరీరంలో ఏం జరుగుతుంది..? కునుకు తీసేముందు..
మధ్యాహ్నం నిద్రపోతే శరీరంలో ఏం జరుగుతుంది..? కునుకు తీసేముందు..
రెడ్ అలోవెరా..సాధారణ కలబంద కంటే ఎన్నో రెట్లు మేలు! తెలిస్తే వదలరు
రెడ్ అలోవెరా..సాధారణ కలబంద కంటే ఎన్నో రెట్లు మేలు! తెలిస్తే వదలరు
ఐపీఎల్ 2026 రికార్డులు.. 200 వికెట్ల క్లబ్‌పై కన్నేసిన దిగ్గజాలు
ఐపీఎల్ 2026 రికార్డులు.. 200 వికెట్ల క్లబ్‌పై కన్నేసిన దిగ్గజాలు
ధూమపానం అలవాటుంటే.. పిల్లలకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం..
ధూమపానం అలవాటుంటే.. పిల్లలకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం..
కొల్లాపూర్ మామిడి రైతుల పాలిట శాపంగా మారిన తెగుళ్లు
కొల్లాపూర్ మామిడి రైతుల పాలిట శాపంగా మారిన తెగుళ్లు
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో శుభవార్త
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో శుభవార్త
బిర్యానీ తింటుండగా బల్లి ప్రత్యక్షం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
బిర్యానీ తింటుండగా బల్లి ప్రత్యక్షం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?