జమ్మూ కాశ్మీర్ గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు

నిత్యం ప్రజలను కాపాడుతూ వారికి రక్షణగా నిలిచే పోలీసులను చంపడం కంటే.. అవినీతి చేసే రాజకీయ నేతల్ని చంపాలని ఏకంగా ఉగ్రవాదులకు సూచించారు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పెద్ద దూమారమే రేగింది. ఆయన ఉగ్రవాదులకు ఈవిధంగా సూచించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కార్గిల్ యుద్ధంలో అమరులైన వారిని స్మరిస్తూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. టెర్రరిస్టులు పోలీసులను […]

జమ్మూ కాశ్మీర్ గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Jul 22, 2019 | 4:39 AM

నిత్యం ప్రజలను కాపాడుతూ వారికి రక్షణగా నిలిచే పోలీసులను చంపడం కంటే.. అవినీతి చేసే రాజకీయ నేతల్ని చంపాలని ఏకంగా ఉగ్రవాదులకు సూచించారు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పెద్ద దూమారమే రేగింది. ఆయన ఉగ్రవాదులకు ఈవిధంగా సూచించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కార్గిల్ యుద్ధంలో అమరులైన వారిని స్మరిస్తూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.

టెర్రరిస్టులు పోలీసులను చంపుతున్నారు. భద్రతా బలగాలను చంపుతున్నారు. ఎస్‌పీఓలను చంపుతున్నారు.. ఇలాంటి వారిని చంపడం కంటే ప్రజల ఆస్తుల్ని దోచుకునే రాజకీయ నేతల్ని, అవినీతికి పాల్పడే అధికారులపై తమ ప్రతాపాన్ని చూపాలన్నారు.