AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాంగ్‌స్టర్‌ ఇంటిని కూల్చేసిన అధికారులు..

యూపీలో గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే వేట కొనసాగుతోంది. మరోవైపు అధికారులు వికాస్ ఆస్తులతో పాటు.. ఆయన గ్యాంగ్‌లో ఉన్న క్రిమినల్స్‌ గురించి వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో తొలుత వికాస్ దుబేకి..

గ్యాంగ్‌స్టర్‌ ఇంటిని కూల్చేసిన అధికారులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 04, 2020 | 7:34 PM

Share

యూపీలో గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే వేట కొనసాగుతోంది. మరోవైపు అధికారులు వికాస్ ఆస్తులతో పాటు.. ఆయన గ్యాంగ్‌లో ఉన్న క్రిమినల్స్‌ గురించి వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో తొలుత వికాస్ దుబేకి చెందిన ఇంటిని అధికారులు కూల్చేశారు. పోలీసు అధికారులు దగ్గర ఉండి మరీ ఆ ఇంటిని కూల్చేశారు. అంతేకాదు.. ఆ ఇంట్లో ఉన్న కార్లను సైతం జేసీబీల సహాయంతో ధ్వంసం చేశారు. మరోవైపు గురువారం వికాస్ దుబే గ్యాంగ్‌ జరిపిన కాల్పుల్లో డీఎస్పీతో సహా.. ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుల్స్ మరణించారు. దీనిపై వికాస్ దుబే తల్లి స్పందించారు. తన కుమారుడు చేసిన చర్య సహించ లేనిదని.. పోలీసులు తన కుమారుడిని కాల్చి చంపేయండని పోలీసులకు సూచించింది. వికాస్ దుబే స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోలేకపోతే.. ఎన్‌కౌంటర్ చేసి చంపేసిన తప్పు లేదని ఓ జాతీయ మీడియాతో తెలిపింది.

కాగా, ఇప్పటికే వికాస్ గ్యాంగ్‌కు సంబంధించి 21 మందిని గుర్తించారు పోలీసులు. మరోవైపు సీఎం యోగీ కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. క్రిమినల్స్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వారికి తగిన శిక్ష పడుతుందని శుక్రవారం అన్నారు.