AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తను హత్య చేసి.. ఎవ్వరినీ రానివ్వకుండా కరెంట్‌ తీగలతో ఇంటికి కంచె..

మానసిక వికలాంగురాలైన ఓ మహిళ తన భర్తను హత్య చేసి, మృతదేహాన్ని ఐదు రోజుల పాటు ఇంట్లోనే దాచింది. పైగా ఇంట్లోకి ఎవ్వరినీ రానివ్వకుండా కరెంట్‌తో ఫెన్సింగ్‌ కూడా ఏర్పాటు చేసింది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో..

భర్తను హత్య చేసి.. ఎవ్వరినీ రానివ్వకుండా కరెంట్‌ తీగలతో ఇంటికి కంచె..
Jharkhand Crime News
Srilakshmi C
|

Updated on: Mar 12, 2023 | 7:24 AM

Share

మానసిక వికలాంగురాలైన ఓ మహిళ తన భర్తను హత్య చేసి, మృతదేహాన్ని ఐదు రోజుల పాటు ఇంట్లోనే దాచింది. పైగా ఇంట్లోకి ఎవ్వరినీ రానివ్వకుండా కరెంట్‌తో ఫెన్సింగ్‌ కూడా ఏర్పాటు చేసింది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడిని రియల్ ఎస్టేట్ వ్యాపారి అమర్‌నాథ్ సింగ్‌గా గుర్తించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లోని మామిడిలోని ఉలిదిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ కాలనీ, రోడ్ నంబర్ 3లో కొంత కాలంగా అమర్‌నాథ్ సింగ్, తన భార్యతో కాపురం ఉంటున్నాడు. ఐతే గత కొన్ని రోజులుగా అమర్‌నాథ్ సింగ్ కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు అతని ఇంటికి వెళ్లి భార్య మీరాను ప్రశ్నించారు. ఐతే సింగ్ భార్య మీరా సమాధానం చెప్పడానికి బదులుగా వారిని తరిమికొట్టింది. ఇరుగుపొరుగు ఇంట్లోకి రాకుండా కరెంట్‌తో ఇంటి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసింది. పైగా ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పూణేలో నివాసముంటున్న సింగ్‌ కుమారుడికి సమాచారం అందించారు. అనంతరం ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగించి.. స్థానికులు ఇంట్లోకి చొరబడ్డారు. ఇల్లు మొత్తం సోదా చేయగా కాలిపోయిన సింగ్ మృతదేహాన్ని చూసి షాక్‌కు గురయ్యారు.

మరోవైపు సింగ్ కుమారుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మీరాను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అమర్‌నాథ్‌ సింగ్‌ గత నాలుగు, ఐదు రోజులుగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిందని, నిందితురాలైన మీరా మానసిక పరిస్థితి సరిగ్గాలేదని, రోజూ ఇంట్లోని వస్తువులను బయటికి విసిరేసి నిత్యం భర్తతో గొడవపడేదని స్థానికులు తెలిపారు. ఈ కేసుపై ధర్యాప్తు చేపట్టాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.