AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెలుగులోకి అమానుషం.. ఏడాదిన్నర బిడ్డ ఛాతీని చీల్చి, గుండెను బయటకు తీసిన తల్లి..!

నేరం చేసిన తర్వాత మహిళ బట్టలు లేకుండా రాత్రి ఇంటికి చేరుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె పరిస్థితి చూస్తుంటే తప్పు చేసిందని అర్థమైంది.

వెలుగులోకి అమానుషం.. ఏడాదిన్నర బిడ్డ ఛాతీని చీల్చి, గుండెను బయటకు తీసిన తల్లి..!
Symbolic Image
Balaraju Goud
|

Updated on: Nov 15, 2024 | 1:02 PM

Share

జార్ఖండ్‌ రాష్ట్రంలో ఓ హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ మూఢనమ్మకాలతో ఓ తల్లి తన ఏడాదిన్నర కుమార్తెను బలితీసుకుంది. సిద్ధి పొందడానికి, తల్లి ఆ బాలిక ఛాతీని చీల్చి, ఆమె హృదయాన్ని బయటకు తీసి తంత్ర పూజ చేసింది. బాలికను బలి ఇచ్చిన తర్వాత మృతదేహాన్ని అక్కడే పాతిపెట్టింది. చివరికి విషయం బయటపడటంతో నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటన పాలము జిల్లాలోని హుస్సేనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖరార్‌పర్ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితురాలైన మహిళ పేరు గీతాదేవి. చనిపోయిన అమ్మాయి పేరు పరి కుమారి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరం చేసిన తర్వాత తాను బట్టలు లేకుండా రాత్రి తంత్ర పూజలు చేశానని నిందితురాలు విచారణలో తెలిపింది. ఆ తర్వాత బాలికను కూడా అక్కడే పాతిపెట్టినట్లు వెల్లడించింది.

తన కూతురిని ఎందుకు బలితీసుకుంది?

నిందితురాలైన మహిళ భర్త అరుణ్ రామ్ ఢిల్లీలో పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై ఆయనకు కూడా సమాచారం అందింది. అత్తగారు కౌసల్యా దేవి తన కోడలుపై కేసు పెట్టారని, ఆ మహిళ గీతాదేవిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖరాపర్‌ గ్రామానికి చెందిన అరుణ్‌రామ్‌ తన భార్య గీతాదేవి ఇంటి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ సమయంలో తంత్ర మంత్రం ద్వారా ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఎవరో చెప్పారు. దీంతో ఒంటరిగా తాంత్రిక పూజలు చేసి కన్నకూతురును బలితీసుకుంది.

నేరం చేసిన తర్వాత మహిళ బట్టలు లేకుండా రాత్రి ఇంటికి చేరుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె పరిస్థితి చూస్తుంటే తప్పు చేసిందని అర్థమైంది. ఆ తర్వాత బాలిక గురించి ఆరా తీస్తే, ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేదు. అయితే బాలికను హత్య చేసింది ఆమెనని ఆ తర్వాత తేలింది. అనంతరం కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మహిళను ఆమె ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..