Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Accident: బిగ్‌ బ్రేకింగ్‌.. ఘోర రైలు ప్రమాదం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

Train Accident: రైలులు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి దూకారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కిందకు దూకిన ప్రయాణికులను ఎదురుగా వస్తున్న బెంగుళూరు ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.

Train Accident: బిగ్‌ బ్రేకింగ్‌.. ఘోర రైలు ప్రమాదం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం
Follow us
Subhash Goud

|

Updated on: Jan 22, 2025 | 6:15 PM

ఇటీవల నుంచి రైలు ప్రమాదాలో పెరిగిపోతున్నాయి. తాజాగా మరో రైలు ప్రమాదం సంభవించింది. జలగావ్‌లోని పరండా రైల్వే స్టేషన్‌ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదశాత్తు పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు వ్యాపించడంతో పలువురుప్రయాణికులు మరణించారు. రైలులు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి దూకారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కిందకు దూకిన ప్రయాణికులను ఎదురుగా వస్తున్న బెంగుళూరు ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది.

పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు చైన్‌ను లాగారు. దీంతో ప్రయాణికులు రక్షించుకునేందుకు ట్రాక్‌పై దూకినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జల్‌గావ్‌లో మరో వైపు అతివేగంతో వెళ్తున్న బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌తో ప్రయాణికులను అతివేగంతో ఢీకొట్టింది. జల్గావ్‌లోని పచోరాలోని పర్ధాడే వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 35 నుంచి 40 మంది ప్రయాణికులు ఎక్స్‌ప్రెస్ నుంచి దూకినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో చైన్‌ లాగిన తర్వాత ప్రయాణికులు రైలు దూకి దూకి ట్రాక్‌ దాటుతుండగా ప్రమాదం జరిగిందని కొందరు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఇంకా అందాల్సి ఉంది. ప్రమాద విషయం తెలియగానే పోలీసులు, రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయాణికులను ఆదుకునేందుకు పరిపాలన సిద్ధంగా ఉందని రాష్ట్ర నీటి సరఫరా శాఖ మంత్రి, జలగావ్ గార్డియన్ మంత్రి గులాబ్రావ్ పాటిల్ తెలిపారు.