ఆపరేషన్ సిందూర్ తర్వాత కీలక ప్రకటన విడుదల చేసిన జైషే చీఫ్ మసూద్ అజార్
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట దాడి చేసింది. జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో జైష్-ఎ-మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు కూడా మరణించారు. దీని ఆయన ఒక ప్రకటన విడుదల చేశాడు.

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ నిర్వహించాయి. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. వీటిలో జైష్-ఎ-మొహమ్మద్ బలమైన బహవల్పూర్, లష్కరే-ఎ-తోయిబా స్థావరం మురిద్కే ఉన్నాయి. బహవల్పూర్లో జరిగిన వైమానిక దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు పది మంది మరణించారు. మృతుల్లో అతని సోదరి కూడా ఉన్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున జరిగిన దాడుల్లో మరణించిన వారిలో అజార్ బావమరిది కూడా ఉన్నాడు.
ఈ దాడి తర్వాత మసూద్ అజార్ ఒక ప్రకటన విడుదల చేశారు. “నా కుటుంబంలోని 10 మంది సభ్యులు మరణించారు. ఐదుగురు అమాయక పిల్లలు జన్నతుల్ ఫిర్దౌస్ పువ్వులుగా మారారు. నా అక్క సాహిబా, నా ప్రాణం కంటే ప్రియమైనది, ఆమె భర్త.. నా మేనల్లుడు అలీమ్ ఫాజిల్, అతని భార్య, నా ప్రియమైన మేనకోడలు ఆలం ఫాజిలా, నా మేనల్లుడు, అతని భార్య అల్లాహ్ కు ప్రియమైనవారు అయ్యారు” అని మసూద్ పేర్కొన్నాడు. “మోదీ అమాయక పిల్లలను, మహిళలను, వృద్ధులను లక్ష్యంగా చేసుకున్నారు. నేను కూడా మరణించిన వారిలో ఉండాల్సిందని నాకు పదే పదే గుర్తుకు వస్తుంది., కానీ అల్లాను కలిసే సమయం ఇంకా రాలేదు.
మా ఇంట్లో మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు, వారు 7 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. ఆ నలుగురూ కలిసి స్వర్గానికి వెళ్లారు. ఇది వారు వెళ్ళడానికి నిర్ణయించిన సమయం, కానీ దేవుడు వారికి జీవితాన్ని ఇచ్చాడు, మరణాన్ని కాదు. ఇప్పుడు మోదీ నిరంకుశత్వం అన్ని మార్గాలను విచ్ఛిన్నం చేసింది. ఇప్పుడు ఎవరూ అక్కడ దయను ఆశించకూడదు” అని ప్రకటనలో తెలిపాడు. కాగాభారత సాయుధ దళాలు బుధవారం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టాయి. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై సాయుధ దళాలు క్షిపణి దాడులు చేశాయి, వీటిలో జైష్-ఎ-మొహమ్మద్ బలమైన బహవల్పూర్, మురిడ్కేలోని లష్కరే-ఎ-తోయిబా స్థావరం ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి