క్రెడిట్ సొసైటీ స్కామ్ లో కేంద్రమంత్రి షెకావత్..!
కేంద్రమంతి గజేంద్ర సింగ్ షెకావత్ చిక్కుల్లో పడ్డారు. క్రెడిట్ సొసైటీ స్కామ్ కు సంబంధించి మంత్రిపై వచ్చిన ఆరోపణలపై విచారించాలని జైపూర్ సిటీ కోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది. సంజీవని క్రెడిట్ సొసైటీ పేరుతో దాదాపు రూ. 900 కోట్ల స్కామ్ కు పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి.
కేంద్రమంతి గజేంద్ర సింగ్ షెకావత్ చిక్కుల్లో పడ్డారు. క్రెడిట్ సొసైటీ స్కామ్ కు సంబంధించి మంత్రిపై వచ్చిన ఆరోపణలపై విచారించాలని జైపూర్ సిటీ కోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది. సంజీవని క్రెడిట్ సొసైటీ పేరుతో దాదాపు రూ. 900 కోట్ల స్కామ్ కు పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. ఈ స్కామ్ లో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ పాత్ర కూడా ఉన్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారిస్తున్న స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ గతేడాదే ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఇందులో మంత్రి పేరు లేకపోవటంతో బాధితులు అప్పుడే మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. మంత్రి పాత్రపై దర్యాప్తు చేయాలని కోరగా కోర్టు అనుమతించలేదు. దీంతో బాధితులు జైపూర్ సిటీ కోర్టును ఆశ్రయించారు. బాధితుల పిటిషన్ స్వీకరంచిన కోర్టు మంత్రి గజేంద్రను కూడా విచారించి నివేదిక అందించాలని ఆదేశించింది.