ఇస్రోనా మజాకా.. స్పేస్ఎక్స్ తప్పిదం గుర్తింపు.. అది శుభాన్షు శుక్లా ప్రాణాలను ఎలా కాపాడిందంటే..!
సాంకేతిక పరిజ్ఞానం, భద్రత విషయానికి వస్తే, భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఎవరికీ తీసిపోదని మరోసారి ప్రపంచానికి చూపించింది. అమెరికాకు చెందిన ప్రసిద్ధ సంస్థ స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్-9 రాకెట్లోని ద్రవ ఆక్సిజన్ లైన్లో ప్రమాదకరమైన పగుళ్లను గుర్తించడం ద్వారా ఇస్రో నలుగురు వ్యోమగాముల ప్రాణాలను కాపాడింది. వీరిలో భారతదేశ పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా కూడా ఉన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం, భద్రత విషయానికి వస్తే, భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఎవరికీ తీసిపోదని మరోసారి ప్రపంచానికి చూపించింది. అమెరికాకు చెందిన ప్రసిద్ధ సంస్థ స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్-9 రాకెట్లోని ద్రవ ఆక్సిజన్ లైన్లో ప్రమాదకరమైన పగుళ్లను గుర్తించడం ద్వారా ఇస్రో నలుగురు వ్యోమగాముల ప్రాణాలను కాపాడింది. వీరిలో భారతదేశ పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా కూడా ఉన్నారు. రూ. 550 కోట్ల వ్యయంతో జరిగిన ఈ మిషన్లో శుభాన్షు శుక్లా కూడా ఉన్నారు.
ఫాల్కన్-9 రాకెట్ జూన్ 19న ఆక్సియం-4 మిషన్ కింద అంతరిక్షంలోకి ఎగరబోతోంది. ప్రయోగానికి ముందు, 13 మంది సభ్యులతో కూడిన ఇస్రో బృందం అమెరికాలోని ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్లో క్షుణ్ణంగా దర్యాప్తు నిర్వహించింది. ఈ సమయంలో, రాకెట్ మొదటి దశలో ఆక్సిడైజర్ లైన్లో ఒక పగులు కనుగొన్నారు. స్పేస్ఎక్స్ మొదట దీనిని ఒక చిన్న లీకేజీగా భావించి ప్రక్షాళన సాంకేతికతతో సరిపెట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఇస్రో చీఫ్ డాక్టర్ వి. నారాయణన్ దానిని పూర్తిగా తిరస్కరించారు. డాక్టర్ వి. నారాయణన్ తగిన శ్రద్ధ వహించాలని డిమాండ్ చేసిన తర్వాత ఈ లోపాన్ని గుర్తించారు. పగుళ్లను పూర్తిగా భర్తీ చేసి, తక్కువ-ఉష్ణోగ్రత లీకేజీ పరీక్ష విజయవంతమయ్యే వరకు ప్రయోగాన్ని అనుమతించబోమని డాక్టర్ నారాయణన్ పట్టుబట్టారు. చివరికి స్పేస్ఎక్స్ ఇస్రో షరతులకు అంగీకరించి, పగిలిన భాగాన్ని భర్తీ చేయాల్సి వచ్చింది.
ఎట్టకేలకు ఇండియన్ ఆస్ట్రోనాట్ గ్రూపు కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 19న ఆయన అంతరిక్ష ప్రయాణం చేయనున్నారు. కెప్టెన్ శుభాన్షు శుక్లా తోపాటు, అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్కు చెందిన స్లావోస్ ఉజ్నాన్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు ఈ మిషన్లో ఉన్నారు. ప్రయోగ సమయంలో ఈ పగుళ్లు పగిలి ఉంటే, రాకెట్లో పేలుడు జరిగి ఉండేది. ద్రవ ఆక్సిజన్ అత్యంత మండే గుణం కలిగి ఉంటుందని, ప్రయోగ సమయంలో రాకెట్లో విపరీతమైన కంపనాలు ఉంటాయని, దీనివల్ల పగుళ్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
ఇస్రో నిబంధనల కారణంగా, ప్రయోగాన్ని 5 సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు అన్ని పరీక్షల తర్వాత, కొత్త ప్రయోగ తేదీ జూన్ 19గా నిర్ణయించారు. యాక్సియం-4లో భాగంగా శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు జూన్ 19వ తేదీన రోదసి యాత్రకు బయలుదేరనున్నట్లు ఇస్రో తెలిపింది. భూమి నుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత ఈ వ్యోమనౌక ఐఎస్ఎస్తో అనుసంధానమవుతుంది. అక్కడే 14 రోజుల పాటు నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో ఉంటారు. అక్కడ వారు 14 రోజులు గడిపి అనేక ప్రయోగాలు చేస్తారు. ఏదైనా కారణం చేత ఈ తేదీని తప్పిపోతే, జూన్ 30 వరకు విండో తెరిచి ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




