AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ జీఎస్టీ భారం.. ‘పార్లే జీ’ ఉద్యోగులకు శాపం.?

దేశ ఆర్ధిక రంగంలో సంక్షోభం ఏర్పడింది. జీడీపీ పడిపోతోంది..మార్చిలో 5.8శాతంగా ఉంటే.. జూన్ త్రైమాసికం 5.4శాతానికి దిగజారిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో మోదీ తెచ్చిన జీఎస్టీ భారం బిస్కెట్ల పరిశ్రమలకు కుదిబండలా మారింది. ఈ ప్రభావం వల్ల ఉద్యోగాలు ఊడిపోయి కంపెనీలు మూతపడే స్థాయికి దిగజారింది. దేశంలో అతి పెద్ద బిస్కెట్ తయారీ కంపెనీ పార్లే – జీ.. కంపెనీ ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక రంగంలో మందగమనం.. కేంద్రం విధించిన 18శాతం జీఎస్టీ […]

మోదీ జీఎస్టీ భారం.. 'పార్లే జీ' ఉద్యోగులకు శాపం.?
Ravi Kiran
|

Updated on: Aug 21, 2019 | 6:57 PM

Share

దేశ ఆర్ధిక రంగంలో సంక్షోభం ఏర్పడింది. జీడీపీ పడిపోతోంది..మార్చిలో 5.8శాతంగా ఉంటే.. జూన్ త్రైమాసికం 5.4శాతానికి దిగజారిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో మోదీ తెచ్చిన జీఎస్టీ భారం బిస్కెట్ల పరిశ్రమలకు కుదిబండలా మారింది.

ఈ ప్రభావం వల్ల ఉద్యోగాలు ఊడిపోయి కంపెనీలు మూతపడే స్థాయికి దిగజారింది. దేశంలో అతి పెద్ద బిస్కెట్ తయారీ కంపెనీ పార్లే – జీ.. కంపెనీ ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక రంగంలో మందగమనం.. కేంద్రం విధించిన 18శాతం జీఎస్టీ తలకుమించిన భారమవడంతో.. దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలిగించే అవకాశం ఉన్నట్లు కంపెనీ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. పార్లే బిస్కెట్ అమ్మకాలు స్వల్పంగా పడిపోవడంతో కంపెనీ ఉత్పత్తిని కూడా తగ్గించనుందని సమాచారం.

‘పార్లే’ కంపెనీ ఎండీ మయాంక్ షా దీనిపై ప్రస్తావిస్తూ.. కేంద్రం విధించిన 18 శాతం జీఎస్టీ భారంగా మారిందని.. దీని వల్ల రెండు ఆప్షన్స్ మాత్రమే కనబడుతున్నాయని అన్నారు. మోదీ, జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుని జీఎస్టీని తగ్గించాలి.? లేదా ఉద్యోగాల కోత విధించాల్సి వస్తుందని ఆయన తెలిపారు.  బిస్కెట్లకు డిమాండ్ బాగా పడిపోయిందని.. అధిక జీఎస్టీ పరిశ్రమను భారీగా దెబ్బతీసిందని షా తెలిపారు.

Follow Us
ఆ విషయంలో NTPCకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఆ విషయంలో NTPCకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
బంగారం ధరలు మరింతగా తగ్గనున్నాయా..?
బంగారం ధరలు మరింతగా తగ్గనున్నాయా..?
ఇంట్లో శివలింగం ప్రతిష్టిస్తున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు..!
ఇంట్లో శివలింగం ప్రతిష్టిస్తున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు..!
దూబే మెరుపులకు కివీస్ విలవిల.. భార్య చేసిన ప్రార్థన ఫలించింది
దూబే మెరుపులకు కివీస్ విలవిల.. భార్య చేసిన ప్రార్థన ఫలించింది
నేనెప్పుడు ఇంతలా భావోద్వేగానికి గురికాలేదు.. రష్మిక ఎమోషనల్..
నేనెప్పుడు ఇంతలా భావోద్వేగానికి గురికాలేదు.. రష్మిక ఎమోషనల్..
మొక్కలు ఏపుగా పెరగాలంటే ఈ ఒక్కటి చాలు.. మీ గార్డెన్ బంగారమే!
మొక్కలు ఏపుగా పెరగాలంటే ఈ ఒక్కటి చాలు.. మీ గార్డెన్ బంగారమే!
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు..
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు..
మారిన ఆధార్ కార్డు అప్డేట్ రూల్స్.. యాప్ నుంచి అన్నీ సేవలు
మారిన ఆధార్ కార్డు అప్డేట్ రూల్స్.. యాప్ నుంచి అన్నీ సేవలు
పృథ్వీ షా మనసు దోచిన ముద్దుగుమ్మ తెలుగు హీరోయిన్ అంట
పృథ్వీ షా మనసు దోచిన ముద్దుగుమ్మ తెలుగు హీరోయిన్ అంట
ఉగాది తర్వాత.. ఆ రాశుల వారి ఇళ్లలో పెళ్లి బాజాలు..!
ఉగాది తర్వాత.. ఆ రాశుల వారి ఇళ్లలో పెళ్లి బాజాలు..!