AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో బ్రెయిన్ ఫివర్, బ్లాక్ ఫివర్ కలకలం.. వైద్య ఆరోగ్య శాఖ అలెర్ట్‌

ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి భయం నుండి బయటపడుతున్నారు. భారత్‌లోనూ కరోనా కలవరం నుంచి ప్రజలు కాస్త ఊరట పొందినట్టుగానే అనుకున్నాం..కానీ, అంతలోనే దేశంలో బ్రెయిన్ ఫివర్, బ్లాక్ ఫివర్ కలకలం సృష్టిస్తోంది.

దేశంలో బ్రెయిన్ ఫివర్, బ్లాక్ ఫివర్ కలకలం.. వైద్య ఆరోగ్య శాఖ అలెర్ట్‌
Japanese Encephalitis
Jyothi Gadda
|

Updated on: Jul 16, 2022 | 2:32 PM

Share

ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి భయం నుండి బయటపడుతున్నారు. భారత్‌లోనూ కరోనా కలవరం నుంచి ప్రజలు కాస్త ఊరట పొందినట్టుగానే అనుకున్నాం..కానీ, అంతలోనే దేశంలో బ్రెయిన్ ఫివర్, బ్లాక్ ఫివర్ కలకలం సృష్టిస్తోంది. అసోంలో జ‌ప‌నీస్ ఎన్‌సెఫ‌లిటిస్(బ్రెయిన్ ఫీవ‌ర్) వైర‌స్ వ‌ణికిస్తుండగా.. పశ్చిమబెంగాల్ లో బ్లాక్ ఫీవర్ కలకలం రేపుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 16 కొత్త కేసులు నమోదు కాగా మోరిగావ్, న‌ల్‌బ‌రి జిల్లాల్లో ఇద్ద‌రు చొప్పున మ‌ర‌ణించారు. అసోంను జ‌ప‌నీస్ ఎన్‌సెఫ‌లిటిస్(బ్రెయిన్ ఫీవ‌ర్) వైర‌స్ వ‌ణికిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 23 మంది చ‌నిపోయారు. మొన్న‌టి వ‌ర‌కు వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన మొరిగావ్, న‌ల్‌బ‌రి జిల్లాల్లో ఈ వైర‌స్ విజృంభిస్తోంది. అసోంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 23 మంది ఈ వైరస్ తో చ‌నిపోయారు. ఈ వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

మరోవైపు, పశ్చిమబెంగాల్ లోని 11 జిల్లాలో మొత్తం 65 బ్లాక్ ఫీవర్ (కాలా అజార్) కేసులు వెలుగు చూశాయి. ప్రధానంగా డార్జిలింగ్, మాల్డా, ఉత్తర్ దినాజ్ పూర్, దక్షిణ్ దినాజ్ పూర్, కలింపోంగ్ జిల్లాల్లో ఎక్కువ కేసులు వచ్చాయి. ఎక్కువ రోజుల పాటు బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లో ఉండి వచ్చిన వారిలోనే జ్వరం బయటపడుతోందని ఓ అధికారి తెలిపారు. అలాగే బంగ్లాదేశ్ కు చెందిన కొందరు వ్యక్తుల్లోనూ ఈ లక్షణాలు ఉన్నాయన్నారు. అయితే తాజా పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలా అజార్ తో ఎవరు ప్రయివేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందినా తాము పూర్తిగా భరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త కేసుల్లో న‌గావ్ జిల్లాలో మూడు, న‌ల్‌బ‌రి, ఉద‌ల్‌గురిలో 3 చొప్పున‌, శివ‌సాగ‌ర్‌లో రెండు, బార్‌పేట‌, కామ‌రూప్‌, క‌ర్బీ, హోజాయి జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున న‌మోదు అయ్యాయి. ఈ వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పాక్ మ్యాచ్ కోసం గంభీర్ మాస్టర్ ప్లాన్.. బరిలోకి 4గురు తోపులు
పాక్ మ్యాచ్ కోసం గంభీర్ మాస్టర్ ప్లాన్.. బరిలోకి 4గురు తోపులు
కొత్త కార్యాలయంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు
కొత్త కార్యాలయంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు
పేపర్ కప్పులో టీ తాగితే క్యాన్సర్ వస్తుందా? నిజాలు తెలుసుకోండి
పేపర్ కప్పులో టీ తాగితే క్యాన్సర్ వస్తుందా? నిజాలు తెలుసుకోండి
ఒకే చోట లక్షల మందితో శివనామ స్మరణ.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ..
ఒకే చోట లక్షల మందితో శివనామ స్మరణ.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ..
లవర్‌తో ఓయోకి వెళ్లినప్పుడు పోలీసులు వస్తే ఏం చేయాలి.?
లవర్‌తో ఓయోకి వెళ్లినప్పుడు పోలీసులు వస్తే ఏం చేయాలి.?
అన్నదాతలకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
అన్నదాతలకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
హోటల్ బిల్లు కట్టలేదు.. రోడ్డున పడ్డ పాక్ హాకీ జట్టు
హోటల్ బిల్లు కట్టలేదు.. రోడ్డున పడ్డ పాక్ హాకీ జట్టు
2019లో యూట్యూబ్‏ను ఊపేసిన సాంగ్.. ప్రతి అబ్బాయి ఏడ్చేసాడు భయ్యా..
2019లో యూట్యూబ్‏ను ఊపేసిన సాంగ్.. ప్రతి అబ్బాయి ఏడ్చేసాడు భయ్యా..
ఒక ప్లేట్ బియ్యం ధరే లక్షల్లో! తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.
ఒక ప్లేట్ బియ్యం ధరే లక్షల్లో! తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.
భర్తకు వాలంటైన్‌గిఫ్ట్‌ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ
భర్తకు వాలంటైన్‌గిఫ్ట్‌ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ