AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Bharat row: ప్రస్తుతం మన దేశం పేరు మార్పుపై చర్య.. 75 ఏళ్ల క్రితం సెప్టెంబర్ నెలలోనే ఇండియా పేరు ప్రస్తావన..

భారతదేశం పేరు 74 సంవత్సరాల క్రితం కూడా చర్చనీయాంశంగా మారింది. దేశానికి పేరు పెట్టే విషయంలో రాజ్యాంగ నిర్మాతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆసక్తికరంగా అప్పుడు కూడా భారత్ పేరు విషయంలో చర్చ జరిగింది కూడా సెప్టెంబర్ నెలలోనే... మళ్ళీ ఇప్పుడు కూడా భారత్ పేరు వివాదం ఇప్పుడు కూడా సెప్టెంబర్ నెలలోనే కొనసాగుతోంది. పేరు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌-1కి సంబంధించిన సవరణను అసెంబ్లీ సభ్యుడు హరివిష్ణు కామత్‌ సమర్పించారు.

India-Bharat row: ప్రస్తుతం మన దేశం పేరు మార్పుపై చర్య.. 75 ఏళ్ల క్రితం సెప్టెంబర్ నెలలోనే ఇండియా పేరు ప్రస్తావన..
India Vs Bharat Controversy
Surya Kala
|

Updated on: Sep 06, 2023 | 12:00 PM

Share

ప్రస్తుతం దేశం పేరుపై చర్చ నడుస్తోంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటనతో ఇది ప్రారంభమైంది. ఇటీవల ఆయన ఇక నుంచి మన దేశాన్ని ఇండియా కాదు భారత దేశం అని పిలవాలని ప్రజలకు విజ్ఞప్తి  చేశారు. దీంతో ఇప్పుడు ఇండియా వెర్సెస్ భారత్ గా మారింది. జీ20కి పంపిన ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్  అని రాయబడింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్‌తో పాటు పలువురు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు.

ప్రభుత్వం ఇండియాను భారత్‌గా మార్చాలనుకుంటోందా అని జైరామ్ రమేష్ తన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. మరోవైపు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. అయితే ఇటువంటి చర్చ కొత్తది కాదు. తాజాగా ఈ అంశం రాజ్యాంగ నిర్మాతల మధ్య కూడా చర్చనీయాంశంగా మారింది.

ఇండియా వర్సెస్ భారత్: చర్చకు 74 ఏళ్లు ఎందుకు పట్టిందంటే?

భారతదేశం పేరు 74 సంవత్సరాల క్రితం కూడా చర్చనీయాంశంగా మారింది. దేశానికి పేరు పెట్టే విషయంలో రాజ్యాంగ నిర్మాతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆసక్తికరంగా అప్పుడు కూడా భారత్ పేరు విషయంలో చర్చ జరిగింది కూడా సెప్టెంబర్ నెలలోనే… మళ్ళీ ఇప్పుడు కూడా భారత్ పేరు వివాదం ఇప్పుడు కూడా సెప్టెంబర్ నెలలోనే కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

పేరు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌-1కి సంబంధించిన సవరణను అసెంబ్లీ సభ్యుడు హరివిష్ణు కామత్‌ సమర్పించారు. పేరుకు సంబంధించి రాజ్యాంగ పరిషత్‌ సభ్యులతో కామత్‌ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించబోతోందని అన్నారు. దేశం పేరుకు సంబంధించి సమావేశంలో పలు సూచనలు చేశారు. ఇందులో భారతదేశం, హిందుస్థాన్, హింద్, భరతభూమి, భరతవర్ష ఉన్నాయి. ఇదే విషయంపై చర్చ మొదలైంది. పేరు మార్చాల్సిన అవసరం ఏముందని కొందరు అంటున్నారని కామత్ అన్నారు. అదే సమయంలో కొంతమంది సభ్యులు ఇండియాకు భారతవర్ష అని పేరు పెట్టాలని సూచిస్తున్నారని తెలిపారు.

రాజ్యాంగ నిర్మాత డా.అంబేద్కర్ తన అభిప్రాయానికి స్పందిస్తూ.. ఈ చర్చ ఉద్దేశమేమిటో నాకు అర్థం కావడం లేదు. తన స్నేహితుడికి భారత్ అనే పదం ఇష్టం. అయితే దేశం పేరు భాషలో మార్పు మాత్రమే  అన్నారు. దేశం మన దేశాన్ని అనేక పేర్లతో పిలుస్తారు.. మన దేశాన్ని ఇంగ్లీషులో ఇండియా అని, ఇతర భారతీయ భాషల్లో భారత్ అని పిలుస్తాము. ద్రావిడ భాషలలో తమిళంలో భారత్, మలయాళంలో భారత్,  తెలుగులో భారత దేశం అని పిలుస్తారు.

ఇదే విషయంపై సేథ్ గోవింద్ దాస్ చారిత్రక సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని భారతదేశం పేరుపై తన అభిప్రాయాలను అందించారు. అదే సమయంలో.. కమలపాటి త్రిపాఠి మధ్య మార్గాన్ని కనుగొనడం గురించి మాట్లాడారు. అదే సమయంలో దేశానికి భారతవర్ష అని పేరు పెట్టాలని మరో సభ్యుడు గోవింద్ పంత్ సూచించారు.

అనేక చర్చల నడుమ విదేశీ సంబంధాలను అనుసంధానించడంతో పాటు దేశం మొత్తాన్ని అనుసంధానించే పేరును ఉంచడంపై ఏకాభిప్రాయం కుదిరింది. అందువల్ల  అంటే ఇండియా అనే పేరును ఇవ్వడంతో పాటు ఈ పేరు రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 లో నమోదు చేశారు. అప్పటి నుండి ఈ పేరు వాడుకలో ఉంది. అయితే ఇప్పుడు ఇండియాను భారత్‌గా మార్చినట్లయితే అది రాజ్యాంగాన్ని సవరించిన తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది.

రాజ్యాంగం ఏం చెబుతోంది?

సుప్రీంకోర్టు న్యాయవాది ఆశిష్ పాండే మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 రాజ్యాంగంలో భారతదేశం.. ఇండియా ఒకటిగా పరిగణించబడుతున్నాయని చెప్పారు. ఎవరి భాషలో వారు సందర్భానుసారం దేశం పేరుని వ్రాయవచ్చు అని చెప్పారు. రాజ్యాంగంలో భారతదేశం లేదా ఇండియా అనే పదాలను తప్పనిసరిగా రాయాలని సూచించలేదని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us