India Population: 2050 నాటికి భారత్ జనాభా ఎంతకు చేరుతుందో తెలుసా? ఈ లెక్కలు తెలిస్తే వామ్మో అంటారు..

మన దేశ జనాభా మరో 30 ఏళ్లకు పీక్స్ కు చేరబోతోంది. భారతదేశ జనాభా 2050 నాటికి1.6 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారతదేశ జనాభా వృద్ధి రేటు క్షీణించడం ప్రారంభించే సంవత్సరం ఇది.

India Population: 2050 నాటికి భారత్ జనాభా ఎంతకు చేరుతుందో తెలుసా? ఈ లెక్కలు తెలిస్తే వామ్మో అంటారు..
India Population
Follow us

|

Updated on: Dec 17, 2021 | 7:51 AM

India Population: మన దేశ జనాభా మరో 30 ఏళ్లకు పీక్స్ కు చేరబోతోంది. భారతదేశ జనాభా 2050 నాటికి1.6 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారతదేశ జనాభా వృద్ధి రేటు క్షీణించడం ప్రారంభించే సంవత్సరం ఇది. ఈ శతాబ్దపు ప్రారంభంలో భారతదేశ జనాభా దాదాపు ఒక బిలియన్. ప్రస్తుతం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా యువ భారతావనిగా గుర్తింపు పొందింది. భారతదేశ సగటు వయస్సు దాదాపు 28.5 సంవత్సరాలు. ఇక అంచనాల ప్రకారం 2050 నాటికి, భారతదేశ జనాభా చైనా కంటే 250 మిలియన్లు ఎక్కువగా ఉంటుంది.

భారతదేశం 2050 నాటికి తక్కువ యువత ఉన్న దేశంగా ఉంటుందని నమ్ముతారు. కానీ జనాభా శాస్త్రవేత్తల ప్రకారం.. భారతదేశ జనాభా ఊహించిన దానికంటే వేగంగా వృద్ధాప్యం చెందుతోంది. అంటే రాబోయే కాలంలో భారతదేశం త్వరగా పాతబడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ధనిక దేశాల జాబితాలో చేరేంత వరకు యువ దేశంగా ఉండగలదా అన్నది పెద్ద ప్రశ్న. నిపుణులు ఈ దశాబ్దం ప్రారంభంలో చైనాకు ఇదే ప్రశ్నను లేవనెత్తారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, సగటు భారతీయ మహిళకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. 1960లో భారతదేశ జనాభా వృద్ధి రేటు 2%. ఈ సమయంలో భారతదేశంలో పెద్ద ఎత్తున కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించారు. తరువాతి దశాబ్దాలలో, గృహ ఆదాయాన్ని పెంచడం, శిశు మరణాలను తగ్గించడం..మహిళా సాధికారత తర్వాత, ఇప్పుడు భారతదేశ పట్టణ జనాభా వృద్ధి రేటు 1.6 శాతంగా ఉంది. ఇది అమెరికా వృద్ధి రేటుతో సమానం.

ఈ శతాబ్దం ప్రారంభంలో చైనా కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. చైనాలో వన్ చైల్డ్ పాలసీని అమలు చేశారు. మరోవైపు వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటు కారణంగా చైనాలో సంపన్న దేశాల కేటగిరీలోకి వచ్చేసరికి వృద్ధుల దేశంగా మారుతుందా అనే ప్రశ్న తలెత్తింది.

భారతదేశంలో కళాశాల గ్రాడ్యుయేట్ల నిరుద్యోగం రేటు 19.3%..

సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ నివేదిక ప్రకారం, భారతదేశంలో కళాశాల గ్రాడ్యుయేట్ల నిరుద్యోగం రేటు 19.3%. ఇది జాతీయ సగటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం, భారతదేశంలోని ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు మాత్రమే వర్క్‌ఫోర్స్‌లో ఉన్నారు. ఈ విషయంలో వెంటనే జాగ్రత్తలు తీసుకోకుంటే ఆర్థిక వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి: Dating Apps: వేగంగా విస్తరిస్తోన్న డేటింగ్ సంస్కృతి.. టాప్‌లో హైదరాబాద్‌.. సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు..

NIFT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు.. రూ. 50 వేలకు పైగా జీతం పొందే అవకాశం..

Tecno Spark 8T: ఇండియన్‌ మార్కెట్లోకి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌.. రూ. 9వేల లోపే అదిరిపోయే టెక్నో స్పార్క్‌ 8టీ..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..