ప్రేమించిపెళ్లాడాడు.. పరాయి మహిళల మోజులోపడి కట్టుకున్నదాన్ని కడతేర్చాడు! అత్త ఎంట్రీతో సీన్ రివర్స్
ఆమెను ఎంతో గాఢంగా ప్రేమించి.. మతం మార్చుకుని మరీ వివాహం చేసుకున్నాడు. ఇంతలో పరాయి మహిళల మోజులోపడి ప్రియమైన భార్యను ఇంట్లోనే చంపేశాడు. అనంతరం భార్య అనారోగ్యంతో మృతి చెందినట్లు..
ఆమెను ఎంతో గాఢంగా ప్రేమించి.. మతం మార్చుకుని మరీ వివాహం చేసుకున్నాడు. ఇంతలో పరాయి మహిళల మోజులోపడి ప్రియమైన భార్యను ఇంట్లోనే చంపేశాడు. అనంతరం భార్య అనారోగ్యంతో మృతి చెందినట్లు ఇరుగుపొరుగును నమ్మించాడు. తమిళనాడులో చోటుచేసున్న ఈ షాకింగ్ ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తమిళనాడులోని దిండుగల్ జిల్లాలోని వేదసందూరు ప్రాంతంలో వడివేలు (38) అనే వ్యక్తి 14 ఏళ్ల క్రితం ఓ ప్రైవేట్ స్పిన్నింగ్ మిల్లులో పనిచేసేవాడు. అక్కడే రంజాన్ (36) అనే మహిళతో వడివేలు ప్రేమలో పడ్డాడు. హిందూ మతంలోకి మారడానికి రంజాన్ నిరాకరించింది. దీంతో వడివేలు మతం మార్చుకుని తన పేరును మహమ్మద్ అబూబకర్ సిద్ధిఖిగా మార్చుకున్నాడు. అనంతరం రంజాన్ను వివాహం చేసుకుని పెరియకులం జిల్లాలోని వడకరైలోని వీఆర్పీ నాయుడు వీధిలో కాపురం పెట్టాడు. కిరాణా దుకాణం నడుపుతూ కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. మహమ్మద్, రంజాన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఐతే గత మూడేళ్ల నుంచి రంజాన్, మహమ్మద్ దంపతుల మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో 2 రోజుల క్రితం రంజాన్ ఊపిరితీసుకోవడంతో ఇబ్బందిపడటంతో కుమార్తెలు భయంతో కేకలు వేశారు. దీంతో ఇరుగుపొరుగు చూసేటప్పటికి రంజాన్ మృతి చెందింది. భార్య అనారోగ్యంతో మృతి చెందినట్లు ఇరుగుపొరుగువారికి కట్టుకథలు చెప్పి, భార్య అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు మహమ్మద్.
ఐతే రంజాన్ తల్లి ఫాతిమా (70) అల్లుడిపై పెరియకుళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రంజాన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గొంతు నులుమడం వల్ల ఊపిరాడక మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీంతో మహమ్మద్ను పోలీసులు అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. కిరాణా దుకాణానికి వస్తున్న మహిళలతో వివాహుతర సంబంధం పెట్టుకుని, భార్యను అడ్డుతొలగించుకున్నట్లు మోహమ్మద్ తెలిపాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.