AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్ పోర్ట్ లో కాస్త తేడాగా ప్రయాణికుడి తీరు..అనుమానంతో బ్యాగ్ తనిఖీ చేయగా పోలీసులకు దిమ్మతిరిగే షాక్

ఈ మధ్య విదేశాల నుంచి మాదక ద్రవ్యాలు భారత్ కు సరఫరా చేయడం.. విమానశ్రయాల్లో దొరికిపోవడం లాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

ఎయిర్ పోర్ట్ లో కాస్త తేడాగా ప్రయాణికుడి తీరు..అనుమానంతో బ్యాగ్ తనిఖీ చేయగా పోలీసులకు దిమ్మతిరిగే షాక్
Drugs
Aravind B
|

Updated on: Mar 21, 2023 | 7:55 AM

Share

ఈ మధ్య విదేశాల నుంచి మాదక ద్రవ్యాలు భారత్ కు సరఫరా చేయడం.. విమానశ్రయాల్లో దొరికిపోవడం లాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ ఐ అధికారులు మరో డ్రగ్ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి సుమారు 10 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ అక్షరాల 70 కోట్లు రూపాయల వరకు ఉంటుందని భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మార్చి 19న అడిస్ అబబా నుంచి ఇండియాకి వచ్చిన ఓ ప్రయాణికుడు తన బ్యాగులో సుమారు 10 కిలోల హెరాయిన్ ను తీసుకొచ్చాడు. ఎయిర్ పోర్టులో తనిఖీలు చేస్తుండగా అతన్ని అదుపులోకి తీసుకోని విచారించారు.

అయితే ఆ ప్రయాణికుడు ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. ముంబాయి లోని ఓ హోటల్లో ఉన్న వ్యక్తికి తాను ఈ బ్యాగ్ ను అప్పగించాలని అధికారులకు చెప్పాడు. దీంతో అధికారులు ఆ వ్యక్తి ఎవరో పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. ఆ ప్రయాణికుడ్ని ఆ హోటల్ కి తీసుకెళ్లి అక్కడ అతని కోసం ఎదురుచూస్తున్న వ్యక్తికి బ్యాగ్ అప్పగించేలా చేశారు. ఆ సమయంలో ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ హోటల్లో పట్టుబడిన మరో వ్యక్తి నైజీరియా దేశస్థునిగా గుర్తించారు. అతడ్ని విచారించగా తాను ఉంటున్న నివాసంలో మరికొన్ని హెరాయిన్, కోకైన్ లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరిద్దరిని అరెస్టు చేసి డీఆర్ఐ కస్టడీ రిమాండ్ కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం