Jalebi Baba: ఎట్టకేలకు పండిన ‘జిలేజీ బాబా’ పాపం.. 120 మందిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో శిక్ష విధింపు

హర్యానాలో సంచలనం రేపిన జిలేజీబాబా పాపం ఎట్టకేలకు పండింది. 120 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఆ కీచకుడికి ఫతేహాబాద్ కోర్టు జనవరి 7 (శనివారం)న శిక్ష ఖరారు చేసింది..

Jalebi Baba: ఎట్టకేలకు పండిన 'జిలేజీ బాబా' పాపం.. 120 మందిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో శిక్ష విధింపు
Haryana Jalebi Baba
Follow us

|

Updated on: Jan 10, 2023 | 8:01 AM

హర్యానాలో సంచలనం రేపిన జిలేజీబాబా పాపం ఎట్టకేలకు పండింది. 120 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఆ కీచకుడికి ఫతేహాబాద్ కోర్టు జనవరి 7 (శనివారం)న శిక్ష ఖరారు చేసింది. బిలేబీబాబా అలియాస్ అమర్‌పురికి శిక్ష విధించింది. పంజాబ్‌లోని మాన్సా్కు చెందిన జిలేబీ బాబా అసలుపేరు అమర్‌వీర్‌. ఇరవై ఏళ్ల క్రితం భార్యతో సహా హరియాణాకు వచ్చిన అమర్‌పురి తహానా రైల్వే రోడ్డులో జిలేబీ దుకాణం తెరిచాడు. కొన్నాళ్లకు భార్య మృతి చెందింది. రెండేళ్ల తర్వాత తోహానాలో జిలేబీ బాబాగా అవతారమెత్తి జనాల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో అతని మాయమాటలు నమ్మిన కొందరు మహిళలను లొంగదీసుకున్నాడు. దెయ్యాలను వదిలించే క్రమంలో ద్రవంలో మత్తుమందు కలిపి వారితో తాగించేవాడు. అనంతరం అకృత్యాలకు పాల్పడేవాడు. అంతేకాకుండా వీడియోలు సైతం తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. వారి వద్ద నుంచి డబ్బు డిమాండ్‌ చేసేవాడు. మరికొందరిని తనతో రిలేషన్‌ కొనసాగించమని వేధించేవాడు.

ఈ క్రమంలో జిలేబీ బాబా ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో మరికొందరు బాధిత మహిళలు ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018లో ఫతేహాబాద్ జిల్లాలోని తోహానాలో ఉన్న జిలేబీబాబా నివాసంపై పోలీసులు దాడి చేసి, తనిఖీలు చేయగా 120కి పైగా వీడియోలు లభించాయి. వీటితోపాటు కొన్ని మత్తుపదార్ధాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియోలన్నీ మొబైల్‌ ఫోన్ల ద్వారా వీడియోతీసినట్లు గుర్తించారు. నిందితుడిని పలు సెక్షన్ల కింద పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇన్నాళ్లకు కోర్టు నిందితుడికి శిక్ష విధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.