- Telugu News India News Gujarat Morbi bridge collapse: These are the main reasons that led to the tragedy
Gujarat Morbi bridge: గుజరాత్ మోర్బీ బ్రిడ్జ్ గురించి ఈ విషయాలు తెలుసా? అసలు బ్రిడ్జ్ ఎందుకు కూలిందంటే..
ప్రపంచంలోనే అత్యంత పొడవైన సస్పెన్షన్ వంతెనగా గుజరాత్లోని మోర్బీ బ్రిడ్జ్ పేరుగాంచింది. ప్రకృతి అందాల మధ్య నిర్మించిన ఈ వంతెన అఫీషియల్ పేరు 'స్కై బ్రిడ్జ్ 721'. దాదాపు 7 నెలల తర్వాత ఈ ఏడాది మేలో బ్రిడ్జ్ను రీఓపెన్ చేశారు. ఐతే కొద్ది రోజులకే బ్రిడ్జ్ కూలడంతో..
Updated on: Nov 01, 2022 | 9:18 PM

ప్రపంచంలోనే అత్యంత పొడవైన సస్పెన్షన్ వంతెనగా గుజరాత్లోని మోర్బీ బ్రిడ్జ్ పేరుగాంచింది. ప్రకృతి అందాల మధ్య నిర్మించిన ఈ వంతెన అఫీషియల్ పేరు 'స్కై బ్రిడ్జ్ 721'. దాదాపు 7 నెలల తర్వాత ఈ ఏడాది మేలో బ్రిడ్జ్ను రీఓపెన్ చేశారు. ఐతే కొద్ది రోజులకే బ్రిడ్జ్ కూలడంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.

మోర్చీ బ్రిడ్జ్కు ఈశాన్యంలో 2 పర్వత శ్రేణులను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనపై ఏకకాలంలో దాదాపు 500 మంది నడవవచ్చు. బ్రిడ్జిపై నుంచి ప్రకృతిని ఆస్వాదించడానికి ప్రపంచ వ్యాప్తంగా వేలాది పర్యాటకులు నిత్యం ఇక్కిడికి వస్తుంటారు.

దాదాపు 8.3 మిలియన్ డాలర్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించారు. 6 సపోర్టింగ్ రోప్లు, 60 విండ్ రోప్ (తాళ్ల) సహాయంతో నిర్మించారు.

కేవలం ఒక మీటరు వెడల్పు గల ఈ వంతెనను చూసేందుకు అన్ని వయసుల వారికి అనుమతి ఉంటుంది. ఐతే ఏకకాలంలో దీనిపైకి 500 మందిని మాత్రమే అనుమతిస్తారు.

ప్రమాదం జరిగిన సమయంలో వంతెన సామర్థ్యం కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా జనం దాని మీదకు చేరడం వల్లనే మోర్బీ విషాదానికి ప్రధాన కారణమని పరిశోధక బృంధాలు చెబుతున్నాయి. దీనిలో వాస్తవమెంతా అనేది తెలియాల్సి ఉంది.

ఈ దుర్ఘటనలో దాదాపు 135 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.




