AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: మహారాష్ట్రలో మరోసారి వేడెక్కిన రాజకీయం.. చిచ్చుపెట్టిన ప్రాజెక్టులు.. షిండే, థాకరే వర్గాల సవాళ్ల పర్వం..

మహారాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. వేదాంత ఫాక్స్‌ కాన్‌, టాటా ఎయిర్‌ బస్‌ ప్రాజెక్టులు గుజరాత్‌కు తరలి వెళ్లడంపై రచ్చ నడుస్తోంది.

Maharashtra: మహారాష్ట్రలో మరోసారి వేడెక్కిన రాజకీయం.. చిచ్చుపెట్టిన ప్రాజెక్టులు.. షిండే, థాకరే వర్గాల సవాళ్ల పర్వం..
Uddhav Vs Shinde
Shiva Prajapati
|

Updated on: Nov 01, 2022 | 9:55 PM

Share

మహారాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. వేదాంత ఫాక్స్‌ కాన్‌, టాటా ఎయిర్‌ బస్‌ ప్రాజెక్టులు గుజరాత్‌కు తరలి వెళ్లడంపై రచ్చ నడుస్తోంది. కోట్లాది రూపాయల కీలక ప్రాజెక్టులు గుజరాత్‌కు తరలివెళ్లడంపై షిండే, థాకరే వర్గాలు.. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్‌కు సవాల్ విసిరారు ఆదిత్య థాకరే. అయితే, ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని షిండే సర్కార్ కౌంటర్ ఇస్తోంది. 30 రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని మహారాష్ట్ర పరిశ్రమల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

కీలకమైన వేదాంత ఫాక్స్‌ కాన్‌, టాటా ఎయిర్‌బస్‌ ప్రాజెక్టులు గుజరాత్‌కు తరలివెళ్లడం మహారాష్ట్రలో అగ్గి రాజేశాయి. ఆ ప్రాజెక్టులను నిలుపుకోవడంలో షిండే ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. సీఎం ఏక్‌నాథ్‌ షిండే-డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లపై నిప్పులు చెరుగుతున్నాయి. ఐతే ప్రాజెక్టులు తరలిపోవడంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడుతోంది అధికార పక్షం. వేదాంత-ఫాక్స్‌కాన్, టాటా-ఎయిర్‌బస్ వంటి మెగా ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్లాయనే దానిపై 30 రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు పరిశ్రమల శాఖా మంత్రి ఉదయ్‌ సామంత్‌. ఈ ప్రాజెక్టులపై కొందరు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని..శ్వేతపత్రంతో స్పష్టత వస్తుందన్నారు. టాటా ఎయిర్‌బస్‌ ప్రాజెక్టును నాగ్‌పూర్‌లోని ప్రతిపాదిత స్ధలంలో ఏర్పాటు చేసేందుకు..తాము ఈ ప్రాజెక్టును వెనక్కితీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

మరోవైపు గత ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రాజెక్టులు మహారాష్ట్ర నుంచి తరలివెళ్తున్నాయని ఎదురుదాడికి దిగింది షిండే ప్రభుత్వం. ఐతే ఆ వాదనను ఖండించారు మాజీ మంత్రి ఆదిత్య థాకరే. ఈ ఏడాది ప్రారంభంలో వేదాంత అధికారులతో పలుమార్లు చర్చలు జరిగాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కోరితే అక్కడ విమానాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని టాటా-ఎయిర్‌బస్ అధికారులు చెప్పారని వెల్లడించారు. ఇలాంటి కీలక ప్రాజెక్టులు గుజరాత్‌కు తరలిపోవడం వల్ల స్థానికుల్లో అనేకమందికి ఉద్యోగావకాశాలు పోయాయని..ప్రాజెక్టులు నిలుపుకోవడంలో షిండే సర్కార్ విఫలమైందని ఆరోపిస్తున్నారు. తన పదవిని కాపాడుకునేందుకు షిండే బీజేపీకి లొంగిపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
నెల సరి సమయంలో మహిళలు అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
నెల సరి సమయంలో మహిళలు అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!