Siddu Moosewala: సిద్దూ మూసేవాలా హత్య కేసులో కీలక మలుపు.. ప్రధాన సూత్రధారి గోల్డీ బ్రార్ అరెస్టు..?..
పంజాబ్ లో పెను సంచలనం కలిగించిన హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసులో ప్రధాన సూత్రధారి గోల్డీ బ్రార్ను పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా అతడిని అదుపులోకి తీసుకున్నారు...

పంజాబ్ లో పెను సంచలనం కలిగించిన హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసులో ప్రధాన సూత్రధారి గోల్డీ బ్రార్ను పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కాలిఫోర్నియా పోలీసులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. నవంబర్ 20కి ముందే అరెస్ట్ చేసి, భారత ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఉన్న 2 కేసుల్లో అతడిపై నోటీసులు జారీ అయ్యాయి. కెనడాకు పలాయనమైన గోల్డీ న్యాయవాదుల సహాయంతో అక్కడి నుంచి కాలిఫోర్నియాకు వెళ్లాడు. కాగా.. పంజాబ్లో కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలో జీపులో వెళ్తున్న సమయంలో ఆయనపై ఓ బృందం కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో సిద్ధూ మూసేవాలా మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
మూసేవాలాను హత్య చేసిన తర్వాత గోల్డీ.. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరంలో నివాసమున్నట్లు సమాచారం. గోల్డీ బ్రార్ దొరికినట్లు భారత గూఢచారి సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా), సీబీఐ, పంజాబ్ పోలీసులకు సమాచారం అందింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిద్దూ మూసేవాలా హత్య తర్వాత గోల్డీ బ్రార్ సమాచారం ఇస్తే రూ. 2 కోట్ల రివార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆయన తండ్రి డిమాండ్ చేశాడు. కేంద్రం ఇవ్వలేకపోతే తానే సొంతంగా డబ్బులు ఇస్తానని సిద్దూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ చెప్పడం గమనార్హం.
గతేడాది డిసెంబర్లో సిద్ధూ.. కాంగ్రెస్లో చేరారు. పంజాబ్లోని మాన్సా నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తుపాకీలు, గ్యాంగ్స్టర్లు.. ఇలా హింసను ప్రేరేపించేవి ఎక్కువగా పాటల్లో చూపించే వివాదాస్పద గాయకుడిగా వార్తల్లోనూ నిలిచారు. ‘తేరీ మేరీ జోడీ’, మోసా జఠ్.. వంటి చిత్రాల్లోనూ నటించారు. 2020 జులై కొవిడ్ లాక్డౌన్ సమయంలో ఫైరింగ్ రేంజ్లో ఏకే-47 ను ఉపయోగించాడన్న అభియోగంతో ఆయనపై కేసు నమోదైంది.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి