AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోరం.. పదహారేళ్ల బాలుడు.. మహిళపై అత్యాచారం చేసి.. ఆపై..

చట్టాలు ఎన్ని ఉన్నా.. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా.. కామాంధుల తీరులో మాత్రం మార్పులు రావడంలేదు. వీ డోంట్ కేర్ అంటూ.. చిన్నారులు, యువతులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పుడుతూనే ఉన్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలు.. వీలైతే అత్యాచారం.. ప్రతిఘటిస్తే హతమార్చడం.. ఇవి దేశంలో నిత్యం జరుగుతున్న దారుణ ఘటనలు. తాజాగా గోవాలో కూడా ఓ మహిళ కామాంధుల చేతిలో ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. గోవా సమీపంలోని పోర్వోరిమ్ సమీపంలోని అడవిలో.. ఫిబ్రవరి 10న కుళ్లిపోయిన స్థితిలో […]

ఘోరం.. పదహారేళ్ల బాలుడు.. మహిళపై అత్యాచారం చేసి.. ఆపై..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 11:29 PM

Share

చట్టాలు ఎన్ని ఉన్నా.. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా.. కామాంధుల తీరులో మాత్రం మార్పులు రావడంలేదు. వీ డోంట్ కేర్ అంటూ.. చిన్నారులు, యువతులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పుడుతూనే ఉన్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలు.. వీలైతే అత్యాచారం.. ప్రతిఘటిస్తే హతమార్చడం.. ఇవి దేశంలో నిత్యం జరుగుతున్న దారుణ ఘటనలు. తాజాగా గోవాలో కూడా ఓ మహిళ కామాంధుల చేతిలో ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. గోవా సమీపంలోని పోర్వోరిమ్ సమీపంలోని అడవిలో.. ఫిబ్రవరి 10న కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ 28 ఏళ్ల మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే సదరు మహిళపై ఓ పదహారేళ్ల బాలుడితో పాటుగా.. మరో వ్యక్తి హత్యాచారం చేశారని పోలీసులు గుర్తించారు. ఒడిషాకు చెందిన మహిళగా గుర్తించిన పోలీసులు.. గత కొద్ది రోజులుగా.. గోవాలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సదరు మహిళపై పదహారేళ్ల కుర్రాడు.. మరో వ్యక్తితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు వెల్లడించారు. మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన తర్వాత.. రిపోర్టుల్లో కూడా ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి.. ఆ తర్వాత హతమార్చినట్లు నివేదికల్లో వెల్లడైందని డీఎస్పీ ఎడ్విన్ కోలాకో స్పష్టం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓ బాలుడిని అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి కోసం గాలింపు చేపడుతున్నారు.