AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Accident: దైవ దర్శనానికి వెళుతుండగా ప్రమాదం.. బస్సులో చెలరేగిన మంటలు, ముగ్గురు మృతి..

Accident: జమ్ముకశ్మీర్‌లో శుక్రవారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. కట్రాలో ఉన్న వైష్ణోదేవీ యాత్రకు వెళుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతించారు. వైష్ణోదేవీ యాత్రకు ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సులో...

Accident: దైవ దర్శనానికి వెళుతుండగా ప్రమాదం.. బస్సులో చెలరేగిన మంటలు, ముగ్గురు మృతి..
Narender Vaitla
|

Updated on: May 13, 2022 | 6:07 PM

Share

Accident: జమ్ముకశ్మీర్‌లో శుక్రవారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. కట్రాలో ఉన్న వైష్ణోదేవీ యాత్రకు వెళుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతించారు. వైష్ణోదేవీ యాత్రకు ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 22 మందికి తీవ్రగాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. బస్సులో మంటలు వ్యాపించిన తర్వాత భారీ పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటన కట్రాకు 1.5 కిమీ దూరంలో జరిగింది. ఇంజన్‌లో మొదలైన మంటలు క్రమంగా బస్సు మొత్తం వ్యాపించాయని అధికారులు తెలిపారు. బస్సులో పేలుడు శబ్ధం వినిపించిందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన నేపథ్యంలో అధికారులు ఉగ్రమూక దాడి ఏమైనా జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బస్సు మంటల్లో కాలుతోన్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి