కేంద్ర మాజీ మంత్రి హర్ సిమ్రత్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక.. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స..

కేంద్ర మాజీ మంత్రి హర్‌ సిమ్రత్ కౌర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో హుటాహుటిన ఆమె చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రిలో చేరారు.

కేంద్ర మాజీ మంత్రి హర్ సిమ్రత్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక.. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స..
Follow us

|

Updated on: Dec 06, 2020 | 8:12 AM

కేంద్ర మాజీ మంత్రి హర్‌ సిమ్రత్ కౌర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో హుటాహుటిన ఆమె చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తొలుత హర్ సిమ్రత్ కౌర్‌కు వైద్యులు కరోనా టెస్ట్ చేయగా నెగెటీవ్ అని తేలింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆమెను ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

శిరోమణి అకాలీదల్ పార్టీ నాయకురాలైన హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఎన్డీయే సర్కార్‌లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాలను అంగీకరించలేమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు నాడే ఆయనకు పంపించి సంచలనం సృష్టించారు.