AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yusuf Pathan: ఎన్నికల ప్రచారం ప్రారంభించిన యూసుఫ్ పఠాన్.. ఎవరిపై పోటీ చేస్తున్నారో తెలుసా..?

భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలోని బహరంపూర్ లోక్‌సభ స్థానం నుండి టిఎంసి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో గురువారం నుంచి ఎన్నికల ప్రచారానికి దిగారు.

Yusuf Pathan: ఎన్నికల ప్రచారం ప్రారంభించిన యూసుఫ్ పఠాన్.. ఎవరిపై పోటీ చేస్తున్నారో తెలుసా..?
Yusuf Pathan
Balaraju Goud
|

Updated on: Mar 21, 2024 | 8:04 PM

Share

భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలోని బహరంపూర్ లోక్‌సభ స్థానం నుండి టిఎంసి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో గురువారం నుంచి ఎన్నికల ప్రచారానికి దిగారు. కాంగ్రెస్ కంచుకోటలో పాగా వేసేందుకు టీఎంసీ యూసుఫ్ పఠాన్‌ను రంగంలోకి దింపింది. యూసుఫ్ పఠాన్‌ను మొదటి నుంచి వ్యతిరేకించిన భరత్ పూర్ టీఎంసీ ఎమ్మెల్యే కబీర్ పఠాన్‌కు ఘన స్వాగతం పలుకుతూ కనిపించడం విశేషం.

తాను బయటి వ్యక్తి అని విపక్షాల వాదనలపై పఠాన్ తొలిసారిగా స్పందించారు. “ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ నుండి వచ్చారు కానీ వారణాసి నుండి పోటీ చేస్తారు, నేను ఇక్కడ నుండి పోటీ చేస్తే సమస్య ఏమిటి? నేను బెంగాల్ బిడ్డను. నేను ఇక్కడ ఉండడానికి వచ్చాను.” అంటూ చమత్కరించారు యూసుఫ్ పఠాన్. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఖాయమన్నారు.

https://twitter.com/AITCofficial/status/1770775806198808998 

క్రికెట్ సారూప్యతను ప్రస్తావిస్తూ, బహరంపూర్‌లో అధీర్ చౌదరీపై తన పోరాటాన్ని “బ్రెట్ లీకి వ్యతిరేకంగా” పోల్చిన పఠాన్, మంచి పోటీ అందించడానికి ప్రయత్నిస్తామన్నారు. టీఎంసీ తన ప్రచార చిత్రాలను పంచుకుంటూ, పార్టీ అభ్యర్థికి హృదయపూర్వక స్వాగతం పలికేందుకు అన్ని వర్గాల ప్రజలు ఒక్కటయ్యారని చెప్పారు.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అయిన అధిర్ రంజన్ చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న బహరంపూర్ లోక్‌సభ స్థానం నుండి పఠాన్ బరిలోకి దిగారు. చౌదరిని కాంగ్రెస్ అభ్యర్థిగా ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ ప్రాంతానికి చెందిన ముఖ్య కాంగ్రెస్ నాయకుడు పఠాన్ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బహరంపూర్ నుండి ఐదు పర్యాయాలు ఎంపి అయిన చౌదరిపై పోటీకి దిగిన పఠాన్, “రాజకీయం, క్రికెట్ ఒకేలా ఉండవు” అని అన్నారు.

బహరంపూర్ లోక్‌సభ స్థానానికి మే 13న నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు పార్టీ నామినేషన్లు దాఖలు చేయడంతో మార్చి 10న టీఎంసీ యూసుఫ్ పఠాన్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. యూసుఫ్ పఠాన్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ టీఎంసీని కోరింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ బయటి వ్యక్తులను తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ ఆరోపించారు.

అయితే పఠాన్ అభ్యర్థిత్వంపై ప్రారంభంలో అంతర్గత పార్టీలో చర్చకు దారితీసింది. TMC భరత్‌పూర్ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ బయటి వ్యక్తి అభ్యర్థి అంటూ విమర్శించారు. అయితే గురువారం కబీర్ మనసు మార్చుకుని పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతో సమావేశం తరువాత, తన అసెంబ్లీ నియోజకవర్గంలో యూసుఫ్ పఠాన్ గెలుపు కోసం ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

గుజరాత్‌లోని బరోడాలో జన్మించిన పఠాన్, దూకుడు ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా క్రికెట్ స్పోర్ట్స్ పిచ్‌పై ఆధిపత్యం చెలాయించిన తర్వాత ఫిబ్రవరి 2021లో అన్ని రకాల క్రికెట్‌ల నుండి అధికారికంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…