AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ్వరం తగ్గుతుందని.. చిన్నారులకు అగర్‌బత్తితో వాతలు పెట్టి పెట్టి.. చివరికి..!

కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో జ్వరానికి చిన్న పిల్లలకు అగరుబత్తులతో వాతలు పెట్టడం వల్ల ఏడు నెలల శిశువు మరణించింది. ఇలాంటి మూఢనమ్మకాల వల్ల మరో 18 మంది పిల్లలు ప్రమాదంలో పడ్డారు. ఈ ఆచారాన్ని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఆధునిక వైద్యంపై నమ్మకం పెంచుకోవాలి.

జ్వరం తగ్గుతుందని.. చిన్నారులకు అగర్‌బత్తితో వాతలు పెట్టి పెట్టి.. చివరికి..!
Fever Treatment With Incens
SN Pasha
|

Updated on: Apr 14, 2025 | 4:31 PM

Share

చిన్న పిల్లలకు జ్వరం వస్తే ఏం చేస్తారు.. డాక్టర్‌ వద్దకు తీసుకెళ్తారు లేదా మెడికల్‌ షాప్‌ నుంచి సిరప్‌ తీసుకొచ్చి తాగిస్తారు. కానీ, ఈ ప్రాంతంలో కాలుతున్న అగర్‌బత్తిలతో వాతలు పెడతారు. ఒకసారి పెట్టిన తర్వాత తగ్గకుంటే మళ్లీ మళ్లీ పెడుతారు. అలా వాతల వల్ల ఓ ఏడు నెలల చిన్నారి కూడా మరణించింది. అయినా కూడా ఈ మూఢ నమ్మకాన్ని కొంతమంది తల్లిదండ్రులు ఇంకా పాటిస్తున్నారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో 18 మంది పిల్లలను అగరుబత్తులతో వాతలు పెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. గత నెలలో విఠలాపూర్ గ్రామంలో ఏడు నెలల శిశువు అటువంటి చికిత్స కారణంగా మరణించిన తర్వాత ఈ ఆందోళనకరమైన ఆచారం వెలుగులోకి వచ్చింది.

ఆ శిశువు తల్లి తన బిడ్డ జ్వరానికి చికిత్స చేయడానికి మండే ధూపం కర్ర (అగర్‌బత్తి) ఉపయోగించింది. వాత పెట్టినప్పుడు కలిగే నొప్పి, అగర్‌బత్తి బూడిదలో దైవిక ఆశీర్వాదాలు ఉంటాయని నమ్మి ఈ పని చేసింది. కానీ, ఆ వాతలు తట్టుకోలేక చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన బయటికి రావడంతో ఆ ప్రాంతంలో అధికారులు విచారణ జరపగా.. విఠలాపూర్ పరిసర ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలానే వాతలు పెడుతున్నట్లు తేలింది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు అదుపు లేకుండా వృద్ధి చెందుతూనే ఉన్నాయి. స్థానికులు అగరుబత్తులతో చర్మాన్ని కాల్చడం వల్ల అనారోగ్యాలు తొలగిపోయని నమ్ముతున్నారు.

ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలు సైన్స్ లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఇక్కడ కొన్ని గ్రామాలు ఇప్పటికీ ఇటువంటి క్రూరమైన పద్ధతులపై ఆధారపడటం దిగ్భ్రాంతికరం. ఈ పద్ధతులను ప్రచారం చేసే బాబాలపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కొంతమంది సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. అయితే విఠలాపూర్‌లో 7 నెలల శిశువు మరణం తరువాత, జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. మిగిలిన 18 సంఘటనలలో తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయాలని డిప్యూటీ కమిషనర్ అధికారులను ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే