Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ్వరం తగ్గుతుందని.. చిన్నారులకు అగర్‌బత్తితో వాతలు పెట్టి పెట్టి.. చివరికి..!

కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో జ్వరానికి చిన్న పిల్లలకు అగరుబత్తులతో వాతలు పెట్టడం వల్ల ఏడు నెలల శిశువు మరణించింది. ఇలాంటి మూఢనమ్మకాల వల్ల మరో 18 మంది పిల్లలు ప్రమాదంలో పడ్డారు. ఈ ఆచారాన్ని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఆధునిక వైద్యంపై నమ్మకం పెంచుకోవాలి.

జ్వరం తగ్గుతుందని.. చిన్నారులకు అగర్‌బత్తితో వాతలు పెట్టి పెట్టి.. చివరికి..!
Fever Treatment With Incens
Follow us
SN Pasha

|

Updated on: Apr 14, 2025 | 4:31 PM

చిన్న పిల్లలకు జ్వరం వస్తే ఏం చేస్తారు.. డాక్టర్‌ వద్దకు తీసుకెళ్తారు లేదా మెడికల్‌ షాప్‌ నుంచి సిరప్‌ తీసుకొచ్చి తాగిస్తారు. కానీ, ఈ ప్రాంతంలో కాలుతున్న అగర్‌బత్తిలతో వాతలు పెడతారు. ఒకసారి పెట్టిన తర్వాత తగ్గకుంటే మళ్లీ మళ్లీ పెడుతారు. అలా వాతల వల్ల ఓ ఏడు నెలల చిన్నారి కూడా మరణించింది. అయినా కూడా ఈ మూఢ నమ్మకాన్ని కొంతమంది తల్లిదండ్రులు ఇంకా పాటిస్తున్నారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో 18 మంది పిల్లలను అగరుబత్తులతో వాతలు పెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. గత నెలలో విఠలాపూర్ గ్రామంలో ఏడు నెలల శిశువు అటువంటి చికిత్స కారణంగా మరణించిన తర్వాత ఈ ఆందోళనకరమైన ఆచారం వెలుగులోకి వచ్చింది.

ఆ శిశువు తల్లి తన బిడ్డ జ్వరానికి చికిత్స చేయడానికి మండే ధూపం కర్ర (అగర్‌బత్తి) ఉపయోగించింది. వాత పెట్టినప్పుడు కలిగే నొప్పి, అగర్‌బత్తి బూడిదలో దైవిక ఆశీర్వాదాలు ఉంటాయని నమ్మి ఈ పని చేసింది. కానీ, ఆ వాతలు తట్టుకోలేక చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన బయటికి రావడంతో ఆ ప్రాంతంలో అధికారులు విచారణ జరపగా.. విఠలాపూర్ పరిసర ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలానే వాతలు పెడుతున్నట్లు తేలింది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు అదుపు లేకుండా వృద్ధి చెందుతూనే ఉన్నాయి. స్థానికులు అగరుబత్తులతో చర్మాన్ని కాల్చడం వల్ల అనారోగ్యాలు తొలగిపోయని నమ్ముతున్నారు.

ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలు సైన్స్ లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఇక్కడ కొన్ని గ్రామాలు ఇప్పటికీ ఇటువంటి క్రూరమైన పద్ధతులపై ఆధారపడటం దిగ్భ్రాంతికరం. ఈ పద్ధతులను ప్రచారం చేసే బాబాలపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కొంతమంది సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. అయితే విఠలాపూర్‌లో 7 నెలల శిశువు మరణం తరువాత, జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. మిగిలిన 18 సంఘటనలలో తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయాలని డిప్యూటీ కమిషనర్ అధికారులను ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..