AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌కు మరో ఝలక్.. కశ్మీర్ అంశంతో మాకు సంబంధం లేదు.. అది భారత్‌దే..

కశ్మీర్ అంశం సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇరు దేశాల మధ్య కాకుండా.. తాజాగా తాలిబన్లు కూడా కశ్మీర్ అంశంపై స్పందించినట్లు ఓ ట్వీట్ వైరల్ అయ్యింది. అయితే అది ఫేక్ ట్వీట్ అని తాలిబన్ తేల్చేసింది. అంతేకాదు.. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌దేనని తాలిబన్ పేర్కొంది. తాము ఇతర దేశలకు సంబంధించిన వ్యవహారాల్లో ఎంటర్ అవ్వమని.. కశ్మీర్‌లో జిహాద్ పేరుతో పాక్ ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతుందని.. అయితే ఈ విషయంలో పాకిస్థాన్‌కు మద్దతు తెల్పినట్లు ఓ ట్వీట్ […]

పాక్‌కు మరో ఝలక్.. కశ్మీర్ అంశంతో మాకు సంబంధం లేదు.. అది భారత్‌దే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2020 | 3:46 PM

Share

కశ్మీర్ అంశం సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇరు దేశాల మధ్య కాకుండా.. తాజాగా తాలిబన్లు కూడా కశ్మీర్ అంశంపై స్పందించినట్లు ఓ ట్వీట్ వైరల్ అయ్యింది. అయితే అది ఫేక్ ట్వీట్ అని తాలిబన్ తేల్చేసింది. అంతేకాదు.. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌దేనని తాలిబన్ పేర్కొంది. తాము ఇతర దేశలకు సంబంధించిన వ్యవహారాల్లో ఎంటర్ అవ్వమని.. కశ్మీర్‌లో జిహాద్ పేరుతో పాక్ ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతుందని.. అయితే ఈ విషయంలో పాకిస్థాన్‌కు మద్దతు తెల్పినట్లు ఓ ట్వీట్ వైరల్ అయ్యిందని.. సదరు ట్వీట్‌తో తమకు సంబంధం లేదని తేల్చేసింది. దీనికి సంబంధించి తాలిబన్‌ పొలిటికల్ వింగ్‌కు చెందిన ఇస్లామిక్‌ ఎమిరేట్స్ ఆఫ్‌ ఆఫ్ఘనిస్థాన్ మీడియా ప్రతినిధి సుహైల్‌ షాహీన్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో తాలిబన్ పేరుతో ఓ ట్వీట్ వైరల్ అయ్యిందని.. అందులో.. “కశ్మీర్‌ సమస్యకు చెక్ పడేంత వరకు.. భారత్‌తో ఎలాంటి సత్సంబంధాలు ఉండవని తాలిబన్ ప్రకటించినట్లు ఉంది.” అయితే అది ఫేక్ న్యూస్ అని.. కశ్మీర్ అంశంపై ఎలాంటి ప్రకటనలు చేయలేదని తాలిబన్‌ తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ వైరల్ ట్వీట్‌ను ముందుగానే గుర్తించిన భారత్.. తాలిబన్‌లపై ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా.. తాలిబన్‌లే ఈ ట్వీట్ గురించి రెస్పాండ్ అయ్యారు.