AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక్కడ నైవేద్యంగా ఇనుప సుత్తి! కోరిక తీరితే తప్పనిసరిగా సమర్పించే అరుదైన ఆలయం ఇదే

Kotgadi Devi Temple Tradition: ఉత్తరాఖండ్‌లోని కోట్‌గడి దేవి ఆలయంలో కోరిక నెరవేరితే భక్తులు ఇనుప సుత్తిని కానుకగా సమర్పిస్తారు. న్యాయం కోసం చివరి ఆశగా భావించే ఈ ఆలయానికి సంబంధించిన విశిష్ట సంప్రదాయం, దాని వెనుక ఉన్న విశ్వాసం గురించి తెలుసుకోండి.

ఇక్కడ నైవేద్యంగా ఇనుప సుత్తి! కోరిక తీరితే తప్పనిసరిగా సమర్పించే అరుదైన ఆలయం ఇదే
Kotgadi Devi Temple
Rajashekher G
|

Updated on: Jul 12, 2026 | 9:20 PM

Share

Kotgari Devi Temple: భారతదేశాన్ని ఆలయాల నిలయంగా పిలుస్తారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఎన్నో పురాతన, విశిష్ట ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయంలో ఒక్కో ప్రత్యేక సంప్రదాయం కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో లడ్డూలు, పండ్లు, కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పిస్తే.. మరికొన్ని ఆలయాల్లో భక్తులు తమ మొక్కులు తీర్చుకున్న తర్వాత విభిన్నమైన కానుకలను సమర్పిస్తుంటారు. అయితే, దేవతకు ‘ఇనుప సుత్తిని’ నైవేద్యంగా సమర్పించే ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే. ఉత్తరాఖండ్‌లోని కుమావోన్ ప్రాంతంలోని ఎత్తైన పర్వతాల మధ్య వెలసిన ‘కోట్‌గడి దేవి ఆలయం’ ఈ విశిష్ట సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం నేటికీ భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాటిస్తున్నారు.

న్యాయం కోసం చివరి ఆశగా భావించే దేవాలయం

స్థానికుల విశ్వాసం ప్రకారం, కోట్‌గడి దేవి ఆలయం న్యాయం జరిగే పవిత్ర స్థానంగా భావించబడుతుంది. కోర్టులు, పోలీసులు లేదా ఇతర మార్గాల ద్వారా న్యాయం లభించని వారు చివరి ఆశగా అమ్మవారిని ఆశ్రయిస్తారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, తప్పుడు ఆరోపణలు లేదా ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు తమ వేదనను ఒక కాగితంపై రాసి అమ్మవారి పాదాల వద్ద ఉంచి ప్రార్థిస్తారు. వారి కోరిక నెరవేరి, తాము కోరుకున్న న్యాయం లభించిందని విశ్వసించిన తర్వాత మళ్లీ ఆలయానికి వచ్చి మొక్కు తీర్చుకుంటారు.

కోరిక తీరితే ఇనుప సుత్తి సమర్పణ

మొక్కు నెరవేరిన అనంతరం భక్తులు తమ శక్తి, సామర్థ్యాన్ని బట్టి ఇనుప సుత్తి, రాగి త్రిశూలం లేదా ఇత్తడి గంటను అమ్మవారికి సమర్పిస్తారు. ముఖ్యంగా ఇనుప సుత్తిని సమర్పించడం ఈ ఆలయ ప్రత్యేకతగా నిలిచింది. అందుకే ఆలయ ప్రాంగణమంతా చిన్నవి, పెద్దవి అనే తేడా లేకుండా వేలాది సుత్తులతో నిండి ఉంటుంది. ప్రతి సుత్తి వెనుక ఒక భక్తుడి విశ్వాసం, నెరవేరిన కోరిక దాగి ఉందని స్థానికులు చెబుతారు.

ఇవి కూడా చదవండి

దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు

కోట్‌గడి దేవి దర్బారులో దోషులకు దేవత స్వయంగా తగిన శిక్ష విధిస్తుందని భక్తుల విశ్వాసం. అన్యాయం చేసిన వారు అనేక కష్టాలను ఎదుర్కొంటారని స్థానికులు చెబుతుంటారు. ఈ నమ్మకంతో ఉత్తరాఖండ్‌తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీర్వాదం పొందుతుంటారు.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న అంశాలు స్థానిక విశ్వాసాలు, ఆలయ సంప్రదాయాల ఆధారంగా ఉన్నాయి. వీటికి శాస్త్రీయ లేదా న్యాయపరమైన నిర్ధారణ ఉందని భావించకూడదు.)

Follow Us