AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం.. కేజ్రీవాల్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్న ఈడీ

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఈడీ రేపు (మే10న) ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనుంది. కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కూడా రేపు తీర్పును వెల్లడించబోతోంది. ఓవైపు రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్న తరుణంలో సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం.. కేజ్రీవాల్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్న ఈడీ
Kejriwal
Balaraju Goud
|

Updated on: May 09, 2024 | 3:26 PM

Share

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఈడీ రేపు (మే10న) ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనుంది. కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కూడా రేపు తీర్పును వెల్లడించబోతోంది. ఓవైపు రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్న తరుణంలో సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు కేజ్రీవాలే ప్రధాన సూత్రధారి అని ఈడీ గట్టిగా వాదిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన మనీ ట్రయిల్‌ను గుర్తించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. లిక్కర్‌ స్కామ్‌లో మార్చి 21 నుంచి తిహార్‌ జైల్లో ఉన్నారు కేజ్రీవాల్‌. ఆయన 170 సెల్‌ఫోన్లు ధ్వంసం చేసినట్టు సంచలన అభియోగాలు నమోదు చేసింది ఈడీ. కేజ్రీవాల్‌కు సంబంధించి చాలా ఆధారాలు తమ దగ్గర ఉన్నట్టు తెలిపింది.

అంతకుముందు, విచారణ సందర్భంగా, కేజ్రీవాల్ సమన్లను 9 సార్లు ఎందుకు వాయిదా వేశారని ఆయన న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేజ్రీవాల్‌కు ఈడీ 9 సార్లు నోటీసులు పంపిందని, ప్రతిసారీ ఎందుకు వాయిదా వేస్తున్నారని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. దీనిపై అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. ‘సిబిఐ పిలిస్తే వెళ్లాడు. ఈడీ నోటీసుపై అరవింద్ కేజ్రీవాల్ సవివరంగా స్పందించారని వివరించారు.

కేజ్రీవాల్‌ దర్యాప్తులో సహకరించినందుకు సంబంధించి 9 సార్లు విచారణకు సమన్లు ​​జారీ చేసినట్లు ఈడీ కోర్టులో పేర్కొంది. 9 సార్లు సమన్లు ​​జారీ చేసినప్పటికీ, అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకాకుండా ప్రశ్నించకుండా తప్పించుకుంటున్నారు. స్కాం సమయంలో 36 మంది వ్యక్తులు 170కి పైగా మొబైల్ ఫోన్‌లను మార్చుకుని ధ్వంసం చేశారని ED తెలిపింది. కేజ్రీవాల్‌ను ఎన్నికల సమయంలో అరెస్టు చేయడం ద్వారా ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించిన కేజ్రీవాల్ వాదనలను కూడా ED తన సమాధానంలో తోసిపుచ్చింది.

ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసింది. అంతకుముందు, ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఇతడేనని, మద్యం వ్యాపారుల నుంచి లంచం డిమాండ్ చేయడంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఆప్.. ఢిల్లీలో నాయకత్వ మార్పు ఉండదని, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని చెబుతూ వస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..