Accident: నీటిగుంతలో పడిపోయిన కారు.. ఎనిమిది మంది దుర్మరణం

బిహార్(Bihar) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ స్కార్పియో వాహనం నీటి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పూర్ణియాలో(Purnia) ఈ ఘటన చోటు చేసుకుంది....

Accident: నీటిగుంతలో పడిపోయిన కారు.. ఎనిమిది మంది దుర్మరణం
Car Accident In Bihar
Follow us

|

Updated on: Jun 11, 2022 | 11:03 AM

బిహార్(Bihar) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ స్కార్పియో వాహనం నీటి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పూర్ణియాలో(Purnia) ఈ ఘటన చోటు చేసుకుంది. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద తీవ్రతను పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు కిశన్​గంజ్​లోని నునియా గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. తారాబడి ప్రాంతంలో జరిగిన ఓ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల బంధువులు సైతం ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. అతి వేగంగా వాహనం నడపడం, డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి