AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న స్కార్పియో పైకి దూసుకొచ్చిన ట్రక్కు.. 8 మంది మృతి, ఇద్దరికి గాయాలు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కౌషంబి జిల్లాలో బుధ‌వారం ఉద‌యం జరిగిన ప్రమాదం బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు.. రోడ్డుపై ఆగి ఉన్న స్కార్పియో పైకి దూసుకొచ్చింది. దేవిగంజ్‌ చౌరస్తాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 8మంది మృతి చెందారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న స్కార్పియో పైకి దూసుకొచ్చిన ట్రక్కు.. 8 మంది మృతి, ఇద్దరికి గాయాలు
Balaraju Goud
|

Updated on: Dec 02, 2020 | 10:43 AM

Share

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కౌషంబి జిల్లాలో బుధ‌వారం ఉద‌యం జరిగిన ప్రమాదం బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు.. రోడ్డుపై ఆగి ఉన్న స్కార్పియో పైకి దూసుకొచ్చింది. దేవిగంజ్‌ చౌరస్తాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 8మంది మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిలో ఇద్దరు కారులోనే చిక్కుకుపోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.

ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో స్కార్పియో వాహ‌నంలో 10 మంది ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. వీరంతా వివాహ వేడుక‌కు హాజ‌రై తిరిగి వ‌స్తుండ‌గా ఈ ఘోరం జ‌రిగింది. స్కార్పియోలో చిక్కుకున్నవారిని బయటకుతీసేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. క్రేన్లు, గ్యాస్‌ కట్టర్ల సాయంతో బయటకుతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారంతా బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. గాయ‌ప‌డ్డ వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని ఆదేశించారు. మృతుల కుటుంబాల‌ను ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని తెలిపారు.