AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: భారత్‌లో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు

దేశంలోని పలు ప్రాంతాలతో పాటు అప్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌లలో భూకంపం చోటు చేసుకుంది. దేశంలోని ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి..

Earthquake: భారత్‌లో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
Earthquake
Subhash Goud
|

Updated on: Jan 06, 2023 | 12:27 AM

Share

దేశంలోని పలు ప్రాంతాలతో పాటు అప్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌లలో భూకంపం చోటు చేసుకుంది. దేశంలోని ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌, ఘజియాబాద్‌, పంజాబ్‌, గురుగ్రామ్‌, నోయిడాల్లో ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.9గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. అయితే ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్‌లోనూ ఈ భూకంపం చోటు చేసుకుంది. అప్ఘనిస్థాన్‌లోని ఫైజాబాద్‌కు దక్షిణాన 79 కిమీ దూరంలో భూకంపం సంభవించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే దీని ప్రభావం పాకిస్థాన్ నుంచి భారత్ వరకు కనిపించింది. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో భూమి కంపించింది.

అప్ఘన్‌లోని హిందూ ఖుష్‌ పర్వత ప్రాంతాల్లో భూమికి 200 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఇవి కూడా చదవండి

అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం చోటు చేసుకున్నప్పటికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది. ఢిల్లీ వాసులు భూకంపం కారణంగా తమకు ఎదురైన అనుభవాలను ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజెన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు.

అయితే భూకంపం వచ్చిన సమయంలో పలు శబ్దాలు కూడా వచ్చినట్లు పలువురు చెబుతున్నారు. భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని, వెంటనే తమ తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామని చెబుతున్నారు. మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'ధురంధర్'కు మించి కలెక్షన్లు.. ఇప్పుడు OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
'ధురంధర్'కు మించి కలెక్షన్లు.. ఇప్పుడు OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!
ఇద్దరికీ పెళ్లైంది.. అయినా గుట్టుగా ఆ యవ్వారం.. కట్ చేస్తే..
ఇద్దరికీ పెళ్లైంది.. అయినా గుట్టుగా ఆ యవ్వారం.. కట్ చేస్తే..