AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Liquor Scam: మరికొన్ని నెలలు జైలులోనే ఉండాల్సి రావొచ్చు.. సీబీఐ విచారణకు ముందు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా ట్వీట్..

ఈరోజు మనీష్ సిసోడియా సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు రాజ్ ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం మనీష్ సిసోడియా చేసిన ట్వీట్‌..

Delhi Liquor Scam: మరికొన్ని నెలలు జైలులోనే ఉండాల్సి రావొచ్చు.. సీబీఐ విచారణకు ముందు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా ట్వీట్..
Manish Sisodia
Sanjay Kasula
|

Updated on: Feb 26, 2023 | 11:26 AM

Share

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇవాళ సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించి అతడిని విచారించనున్నారు. తన అరెస్ట్ పట్ల మనీష్ సిసోడియా ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకు ముందు కూడా మనీష్ సిసోడియాను 9 గంటల పాటు ప్రశ్నించారు. ఈరోజు మనీష్ సిసోడియా సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు రాజ్ ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం మనీష్ సిసోడియా చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఇవాళ నన్ను సీబీఐ ప్రశ్నించనుంది. ‘‘నేను ఈ రోజు సీబీఐ విచారణకు మరోసారి హాజరవుతున్నాను. విచారణకు పూర్తిగా సహకరిస్తాను. మరికొన్ని నెలలు జైలులోనే ఉండాల్సివచ్చినా.. నేను లెక్కచేయను. నేను భగత్‌సింగ్‌ను అనుసరించే వ్యక్తిని’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. అంతకుముందు ఫిబ్రవరి 19న హాజరుకావాలని సీబీఐ ఆయనకు సమన్లు ​​పంపింది. సిసోడియాకు ఆర్థిక శాఖ కూడా ఉంది. కాబట్టి బడ్జెట్ సన్నాహాలను ఉటంకిస్తూ మునుపటి తేదీకి హాజరుకాలేమని అతను తన అసమర్థతను వ్యక్తం చేశాడు. దీని తర్వాత సీబీఐ ఆయనకు నేటి తేదీని ఇచ్చింది.

నిజానికి ఈ కేసులో దాఖలైన చార్జిషీటులో మనీష్ సిసోడియా పేరు లేదు. ఛార్జిషీటు దాఖలు చేసిన మూడు నెలల తర్వాత మనీష్ సిసోడియాను విచారిస్తున్నారు. నేటి విచారణలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ప్రశ్నలకు సీబీఐ సమాధానాలు కోరనుంది. దీంతో పాటు మద్యం వ్యాపారులతో సిసోడియాకు ఉన్న సంబంధాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా అడగనున్నారు. ఈ కేసుకు సంబంధించిన సాక్షుల వాంగ్మూలాలపై కూడా సిసోడియా తరఫు వివరాలు వెల్లడి కానున్నాయి.

సిబిఐ ప్రశ్నల జాబితా..

ఈ వ్యవహారంలో సిసోడియాను సీబీఐ ఇప్పటికే ప్రశ్నించినట్లు తెలిసింది. అక్టోబర్ 17న సిబిఐ ఆయనను సుమారు 9 గంటల పాటు విచారించింది. ఈ సందర్భంగా ఆయన మద్దతుదారులు సీబీఐ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇప్పుడు సిసోడియాకు సన్నిహితుడిగా భావిస్తున్న దినేష్ అరోరా నేరాంగీకార వాంగ్మూలం, ‘సౌత్ లాబీ’ సభ్యులు, రాజకీయ నాయకులు, మద్యం వ్యాపారుల విచారణలో లభించిన సమాచారం ఆధారంగా సీబీఐ సుదీర్ఘ ప్రశ్నల జాబితాను సిద్ధం చేసింది.

సిసోడియాపై ఈ ఆరోపణలు

మద్యం వ్యాపారులకు లైసెన్సులు ఇచ్చే ఢిల్లీ ప్రభుత్వ విధానం వల్ల కొంతమంది డీలర్లు లబ్ధి పొందారని, ఈ డీలర్లు తమ ఇష్టానుసారం పాలసీని తయారు చేసుకునేందుకు లంచాలు ఇచ్చారని ఆరోపించారు. మనీష్ సిసోడియాకు ఢిల్లీ ఎక్సైజ్ శాఖ కూడా ఉంది, అందుకే ఆయనపై కూడా ఆరోపణలు వస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి