Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాహేతర సంబంధం.. ప్రియురాలి భర్త గొంతు కోసి హతమార్చి.. ఆపై నిప్పంటించాడు!

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి భర్తను చంపాడో కిరాతకుడు. ఢిల్లీలో వజీరాబాద్‌లో శనివారం చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వివాహేతర సంబంధం.. ప్రియురాలి భర్త గొంతు కోసి హతమార్చి.. ఆపై నిప్పంటించాడు!
Delhi Crime News
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 08, 2023 | 3:20 PM

వివాహేతర సంబంధం మోజులోపడి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి భర్తను చంపాడో కిరాతకుడు. ఢిల్లీలో వజీరాబాద్‌లో శనివారం చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని వజీరాబాద్‌ పరిధిలోని రామ్ ఘాట్‌లో నివాసముంటున్న మునిషద్దీన్‌ (27) ఏళ్ల యువకుడు.. ఆదే ఏరియాకు చెందిన రషీద్ ఇద్దరూ స్నేహితులు. వీరు ప్లంబర్, ఎలక్ట్రీషియన్లుగా పని చేసేవారు. తరచుగా ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్తూ ఉండే క్రమంలో రషీద్ భార్యతో మునిషద్దీన్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ప్రియురాలిని కలుసుకునేందుకు అడ్డుగా ఉన్నాడని భావించిన మునిషద్దీన్‌ రషీద్‌ను అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. అందుకు పక్కా ప్లాన్‌ వేసి అమలు చేశాడు.

ఈ రోజు ఏం జరిగిందంటే..

సంఘటన జరిగిన రోజున నిందితుడు రషీద్‌ను రామ్ ఘాట్‌కు తీసుకెళ్లాడు. అనంతరం ఇద్దరూ కలిపి ఫూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులోనే రషీద్‌పై దాడి చేసి, కత్తితో అతని కడుపులో పొడిచి, గొంతు కోసి మునిషద్దీన్‌ హత్య చేశాడు. ఆ తర్వాత రషీద్ మృతదేహాన్ని మాయం చేసేందుకు అక్కడ ఉన్న పొదల్లో పడేసి, దహనం చేశాడు. జనవరి 2న రామ్ ఘాట్ ముందు 90 శాతం కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఆ ఏరియా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా నిందితుడి గుర్తించారు. అనంతరం మాటువేసి నిందితుడైన మునిషద్దీన్‌ను అరెస్టు చేసినట్లు స్పెషల్ కమీషనర్ ఆఫ్ క్రైమ్ పోలీస్ రవీంద్ర సింగ్ యాదవ్ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.