AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Biparjoy: బిపర్‌జాయ్‌ ఉగ్రరూపం.. తుఫాన్ ధాటికి వణికిపోతోన్న తీర ప్రాంతాలు..

Cyclone Biparjoy Updates: బిపర్‌జాయ్ తుఫాన్ మరింత ఉగ్రరూపం దాల్చుతోంది. గుజరాత్ తీరం వైపు దూసుకొస్తూ అంతకంతకూ బలపడుతోంది. తుఫాన్ ధాటికి గుజరాత్ గజగజ వణికిపోతోంది. ఈ తుఫాన్‌.. గుజరాత్‌లోని జఖౌ వద్ద రేపు సాయంత్రం తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Cyclone Biparjoy: బిపర్‌జాయ్‌ ఉగ్రరూపం.. తుఫాన్ ధాటికి వణికిపోతోన్న తీర ప్రాంతాలు..
Cyclone Biparjoy
Shaik Madar Saheb
|

Updated on: Jun 14, 2023 | 9:43 AM

Share

Cyclone Biparjoy Updates: బిపర్‌జాయ్ తుఫాన్ మరింత ఉగ్రరూపం దాల్చుతోంది. గుజరాత్ తీరం వైపు దూసుకొస్తూ అంతకంతకూ బలపడుతోంది. తుఫాన్ ధాటికి గుజరాత్ గజగజ వణికిపోతోంది. ఈ తుఫాన్‌.. గుజరాత్‌లోని జఖౌ వద్ద రేపు సాయంత్రం తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ద్వారక, కచ్ ప్రాంతాల మధ్య 150 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకనున్నట్లు అంచనా వేస్తోంది. అదే జరిగితే ఆ ప్రాంతంలో విధ్వంసం ఖాయంగా కనిపిస్తుంది. బిపర్‌జాయ్‌ తుఫాన్‌ పశ్చిమ తీరంలో పెను విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దాంతో.. తీర ప్రాంతాల్లో విపత్తు బృందాలను మోహరించారు. గుజరాత్‌, మహారాష్ట్రలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో లక్షా 30 వేల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్‌పై గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయించి.. సముద్రంలోకి వెళ్లకూడదని సూచించింది. తీర ప్రాంతాలకు చెందిన 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, తుఫాన్‌ కారణంగా 69 రైళ్లు రద్దయ్యాయి. మరో 58రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే తెలిపింది.

తుఫాన్ ప్రభావంతో గుజరాత్‌, కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్రల్లోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 160 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ప్రధానంగా.. గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కఛ్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే.. తుఫాన్ తీరానికి సమీపిస్తోన్న కొద్దీ తీవ్రత పెరుగుతోంది. అయితే, తీర ప్రాంతాల్లో వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని.. సహాయక చర్యల కోసం సైన్యాన్ని కూడా రంగంలోకి దించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

బిపర్‌జాయ్‌ తుఫాన్‌పై అత్యవసర సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. తుఫాన్‌పై ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేశామన్నారు అమిత్‌షా. సహాయక చర్యల కోసం NDRF , SDRF బృందాలను సిద్దం చేసినట్టు వెల్లడించారు. అటు.. గుజరాత్‌లోని తుఫాన్‌ పరిస్థితిని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తీరప్రాంతాల్లో పర్యటించి సహాయక సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి