దేశంలో కరోనా విజృంభణ.. 71 లక్షలు దాటేసిన కేసులు
భారత్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 66,732 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 71,20,539 కు చేరింది
Corona India Updates: భారత్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 66,732 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 71,20,539 కు చేరింది. తాజాగా 816 మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందగా.. మరణాల సంఖ్య 1,09,150 కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 61,49,536 చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,61,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కోవిడ్ బాధితుల రికవరీ రేటు 86.4 శాతంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ వెల్లడించింది. అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పరీక్షల సంఖ్య 8,68,77,242కు చేరిందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.
Read More:
తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే