AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడ్డుకున్నందుకు పోలీసును 200 మీటర్లు కారుతో లాక్కెళ్లి..!

కరోనాకు అడ్డుకట్టవేసేందుకు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నారు పోలీసులు. అయితే వారిపై కొందరు అమానుషంగా వ్యవహరిస్తున్నారు.

అడ్డుకున్నందుకు పోలీసును 200 మీటర్లు కారుతో లాక్కెళ్లి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 02, 2020 | 7:51 PM

Share

కరోనాకు అడ్డుకట్టవేసేందుకు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నారు పోలీసులు. అయితే వారిపై కొందరు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. కుటుంబాన్ని వదిలి మన కోసం కష్టపడుతున్నారనే కనీస జాలి కూడా లేకుండా పోలీసులపై దాడులు చేస్తున్నారు. ఆ మధ్యన పంజాబ్‌లో లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీస్‌ చేయిని ఓ వ్యక్లి నరికివేయగా.. మరోచోట వివరాలు అడిగిన పోలీస్‌పై ఓ యువతి డాక్యుమెంట్లు విసిరేసి హల్‌చల్ చేసింది. తాజాగా అడ్డుకున్నందుకు పోలీసుపై ఓ వ్యక్తి కారుతో దాడికి యత్నించాడు. ఈ సంఘటన ;పంజాబ్‌ జలంధర్‌లోని మిల్క్‌ చౌక్‌ చెక్‌పోస్ట్ వద్ద చోటుచేసుకుంది.

మిల్క్‌చౌక్ వద్ద ఏఎస్‌ఐ ముల్క్‌రాజ్‌ సహా మరికొందరు పోలీసులు విధులు నిర్వహిస్తుండగా.. అటుగా వచ్చిన ఓ కారును ముల్క్‌రాజ్‌ అడ్డుకొని, కర్ఫ్యూ పాస్ చూపించమన్నారు. దాంతో ఆ వ్యక్తి కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఈ ప్రమాదాన్ని ముందే గ్రహించిన ముల్కరాజ్‌ కారు బానెట్‌పైకి దూకి పట్టుకున్నాడు. ఆయన కారుపై ఉండగానే.. ఆ వ్యక్తి 200 మీటర్ల దూరం వాహనాన్ని తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న మిగిలిన పోలీసులు పరుగెత్తికెళ్లి కారును అడ్డుకుని.. ముల్క్‌రాజ్‌ను రక్షించారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సుర్జీత్ సింగ్ తెలిపారు.

Read This Story Also: కరోనా నియంత్రణకు ‘ఇమ్యునోథెరపీ’.. అమెరికా కంపెనీతో ఒప్పందం..!