ప్రజలను మోసగించారు, ఇది ప్రజా ద్రోహక బడ్జెట్, కాంగ్రెస్ నేత పి.చిదంబరం మండిపాటు

ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్లో ప్రజలకు ద్రోహం చేశారని, ఇది కేవలం ధనికులకు మాత్రమే ప్రయోజనకమైనదని కాంగ్రెస్ సీనియర్ నేత..,

ప్రజలను మోసగించారు, ఇది ప్రజా ద్రోహక బడ్జెట్, కాంగ్రెస్ నేత పి.చిదంబరం మండిపాటు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 01, 2021 | 7:18 PM

ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్లో ప్రజలకు ద్రోహం చేశారని, ఇది కేవలం ధనికులకు మాత్రమే ప్రయోజనకమైనదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి  పి. చిదంబరం ఆరోపించారు. రిపబ్లిక్ దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన వేలాది రైతులకు వ్యతిరేకంగా, వారిపై కక్ష గట్టిన రీతిలో ఈ బడ్జెట్ ఉందన్నారు. అన్నదాతలకు సాయపడాల్సింది పోయి వారికి హాని కలిగించేదిగా ఇది ఉందన్నారు. వ్యాక్సిన్లకు కేటాయింపులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లను కలిపేశారని ఆయన విమర్శించారు. రక్షణ, ఆరోగ్య రంగాలకు నిధులను మరింత పెంచాల్సి ఉందన్నారు. పెట్రోలియం ఉత్పతులతో సహా పలు వస్తువులపై సెస్ విధించారని, కానీ ఎంపీల్లో చాలామందికి ఈ విషయం తెలియదని చిదంబరం పేర్కొన్నారు. సెస్సుల నుంచి వచ్ఛే ఆదాయంతో రాష్ట్రాలకు ఎలాంటి వాటా లభించదని ఆయన చెప్పారు. ఇది అన్నదాతలతో సహా సగటు వ్యక్తిపై క్రూరమైన దెబ్బ అని ఆయన అభివర్ణించారు.

దేశంలో అనేక పరిశ్రమలు మూత పడ్డాయని, ఇంకా వేలమంది ఉద్యోగాలకోసం అల్లాడుతున్నారని, వారి విషయాన్ని ఈ బడ్జెట్లో ప్రస్తావించారా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు జరిపారు..కానీ ఈ పెద్ద బడాయి కబుర్లకు ప్రజలు మోసపోరు అని ఆయన వ్యాఖ్యానించారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!