AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తప్పతాగి స్కూల్‌కు వచ్చిన ఉపాధ్యాయుడు. మైకంలో క్లాస్‌రూంలోనే.. !

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. దీని తర్వాత, అతను తరగతిలోని విద్యార్థులకు అస్పష్టమైన మాటలతో బోధించాడు. అంతే కాదు, అతను ప్యాంటుకు బదులుగా షార్ట్స్ ధరించి స్కూల్‌లోకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకునేందుకు విద్య శాఖ అధికారులు సిద్ధమయ్యారు.

తప్పతాగి స్కూల్‌కు వచ్చిన ఉపాధ్యాయుడు. మైకంలో క్లాస్‌రూంలోనే.. !
Ambikapur Government Teacher
Balaraju Goud
|

Updated on: Aug 10, 2025 | 2:24 PM

Share

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పుతున్నారు. తాజాగా ఒక ఉపాధ్యాయుడు తాగిన మత్తులో పిల్లలకు బోధించడానికి స్కూల్‌కు వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌ జిల్లా వాద్రాఫ్‌నగర్ బ్లాక్ పరిధిలోని రుప్పూర్ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక ఉపాధ్యాయుడు శుక్రవారం(ఆగస్టు 8) తాగిన మత్తులో షార్ట్స్ ధరించి పాఠశాలకు వచ్చాడు. అతను కుర్చీపై కూర్చుని టేబుల్‌ మీద ఉన్న పుస్తకాలపై తన కాళ్ళు పెట్టాడు. ఇదేంటని అడిగితే, డాక్టర్ ప్రతిరోజూ 100 నుండి 200 గ్రాముల మద్యం తాగమని చెప్పాడని, అప్పుడే నడవగలనన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిన తర్వాత, సదరు టీచర్‌పై చర్యలు తీసుకోవాలని DEO, జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపారు.

వాద్రాఫ్ నగర్ బ్లాక్ లోని రుప్పూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా మన్మోహన్ సింగ్ విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తరచుగా మద్యం మత్తులో పాఠశాలకు వస్తారని ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలోనే శుక్రవారం, ఆయన కాషాయ రంగు కండువా, బోల్ బామ్ అని రాసిన టీ-షర్టు, మోకాలు వరకు ఉండే షర్ట్స్ ధరించి పాఠశాలకు చేరుకున్నారు. టేబుల్ మీద పడి ఉన్న పుస్తకాలను తొక్కారు. దీని తర్వాత, తరగతిలోని పిల్లలకు అస్పష్టమైన మాటలతో బోధించారు. ఉపాధ్యాయుడు తాగిన మత్తులో టేబుల్ మీద కాళ్ళు పెట్టుకుని బోధిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మద్యం సేవించి పాఠశాలకు రావడం గురించి మన్మోహన్ సింగ్‌ను ప్రశ్నించగా, ప్రమాదంలో తన కాలు విరిగిందని చెప్పాడు. తాను చికిత్స పొందుతున్నానని, ప్రతిరోజూ 100 నుండి 200 గ్రాముల మద్యం మందుగా తాగితే నడవగలనని డాక్టర్ చెప్పాడని, అందుకే తాను తాగుతున్నానని చెప్పాడు. రుప్పూర్ గ్రామస్తులు ఈ ఉపాధ్యాయుడు గతంలో చాలాసార్లు మద్యం తాగి పాఠశాలకు వచ్చాడని చెబుతున్నారు. దీనిపై విద్యా శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఆయనను హెచ్చరించి వదిలివేశారు. గతంలో రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

ఈ విషయంలో వాద్రాఫ్‌నగర్ బిఇఓ శ్యామ్ కిషోర్ జైస్వాల్ స్పందించారు. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత, సదరు ఉపాధ్యాయుడికి తుది హెచ్చరిక నోటీసు జారీ చేశామని చెప్పారు. ఇక్కడి నుండి, దర్యాప్తు నివేదికను డిఇఓ, జిల్లా కలెక్టర్‌కు పంపామని, అందులో సస్పెన్షన్‌కు సిఫార్సు చేశామని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు
అందుకే అవకాశాలు కోల్పోయాను.. హీరోయిన్ తాప్సీ..
అందుకే అవకాశాలు కోల్పోయాను.. హీరోయిన్ తాప్సీ..
ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా? నెట్టింట ఫొటోలు వైరల్
ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా? నెట్టింట ఫొటోలు వైరల్
ఖాళీ క్లాస్ రూమ్‌లు.. తుస్సుమన్న గ్యారెంటీలు.. కాంగ్రెస్‌పై..
ఖాళీ క్లాస్ రూమ్‌లు.. తుస్సుమన్న గ్యారెంటీలు.. కాంగ్రెస్‌పై..