chennai police makes e-pass mandatory చెన్నైలో ప్రయాణించాలంటే ఇక ఈ-పాస్ తప్పనిసరి ! పోలీసుల అర్ధరాత్రి ఉత్తర్వులు, అంతా గందరగోళం
లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు పరచేందుకు చెన్నై పోలీసులు కొత్త నిబంధనలు విధించారు. నగరంలో ఒక పోలీసు స్టేషన్ పరిధి నుంచి మరో పోలీసు స్టేషన్ పరిధికి వెళ్లేవారికి ఈ-పాస్...

లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు పరచేందుకు చెన్నై పోలీసులు కొత్త నిబంధనలు విధించారు. నగరంలో ఒక పోలీసు స్టేషన్ పరిధి నుంచి మరో పోలీసు స్టేషన్ పరిధికి వెళ్లేవారికి ఈ-పాస్ (రిజిస్ట్రేషన్) తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గ్రేటర్ చెన్నై పోలీసు శాఖ సర్క్యులర్ ను విడుదల చేసింది. మంగళవారం నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని నగర పోలీసు కమిషనర్ శంకర్ జివాల్ తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.12 పోలీసు స్టేషన్ల పరిధిలో 13 చెక్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కూడా ఆయన ఆదేశించారు.ప్లవర్ బజార్, వాషర్ మెన్ పేట్, పులియంతోప్, అన్నా నగర్, అంబత్తూర్, కిల్పాక్, ట్రిప్లికేన్, మైలాపూర్, సెయింట్ ధూప్ మౌంట్, అడయార్, టీ నగర్ ఈ పరిధిలోకి వస్తాయి. పోలీస్ స్టేషన్ల లిమిట్స్ ను 348 సెక్టార్లుగా విభజించి..అప్పుడే రోడ్లపై బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ-పాస్ లేనిదే ప్రజలు ఒకచోటి నుంచి మరో చోటికి వెళ్లే వీలు లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ ఉత్తర్వులను గతరాత్రి పొద్దుపోయిన తరువాత జారీ చేయడంతో ఈ రోజు వాహనదారులు అనేకమంది అయోమయానికి గురయ్యారు. గందరగోళంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయి.
ఈ-పాసులు లేని వాహనదారులను పోలీసులు వారి ఇళ్లకు తిప్పి పంపుతున్నారు. కొన్ని చోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్యుధ్ధానికి దిగారు. ఉన్నట్టుండి ఈ ఉత్తర్వులేమిటని వారితో వాదించారు. కనీసం ఒక రోజు ముందు వార్తా పత్రికల్లో, టీవీల్లో ఈ ఉత్తర్వుల గురించి ప్రకటించి ఉండాల్సిందని అంటున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఇంట్లో తీవ్ర విషాదం.. చివరి చూపు కూడా దక్కలేదంటూ ఎమోషనల్..