గుడ్ న్యూస్.. రియల్ ఎస్టేట్ రంగంపై కేంద్రం సంచలన ప్రకటన
గత కొద్ది రోజులుగా ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్తో రియల్ ఎస్టేట్ రంగం ఢీలా పడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం సంచలన ప్రకటన విడుదుల చేసింది. రియల్ రంగానికి భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్తో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ కలసి ఈ రంగంలో పెట్టుబడులు […]
గత కొద్ది రోజులుగా ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్తో రియల్ ఎస్టేట్ రంగం ఢీలా పడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం సంచలన ప్రకటన విడుదుల చేసింది. రియల్ రంగానికి భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్తో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ కలసి ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. రూ.25000 కోట్లతో రియల్ రంగానికి బూస్టింగ్ ఇచ్చే.. ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు, మిగిలిన నిధులను ఎస్బీఐ, ఎల్ఐసీ కలసి సంయుక్తంగా పెట్టుబడి పెట్టబోతున్నాయి.
దేశవ్యాప్తంగా 1600 ప్రాజెక్టుల్లో 4.8లక్షల హౌసింగ్ ప్రాజెక్ట్ యూనిట్ల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయినట్టు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈ ప్రత్యేక ఫండ్ను.. ప్రాధాన్యక్రమంలో వినియోగించనున్నారు. తొలుత ఎక్కువ శాతం పూర్తయి.. కొంచెం మిగిలిన ప్రాజెక్టులపై ఇన్వెస్ట్ చేయనున్నారు. అందరికీ అందుబాటు ధరల్లో ఉండే గృహాలు, మధ్యతరహా హౌసింగ్ ప్రాజెక్టుల మీద ఎక్కువగా ఆ నిధులను ఖర్చుపెట్టనున్నారు. దీంతో రియల్ రంగం మళ్లీ ఊపందుకోనుంది.