AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bomb Threat: దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు..

మన దేశంలో ఈమధ్య బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతోంది. మొన్నటి వరకూ ప్రముఖులకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఈసారి విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఆగంతకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలపై బాంబు దాడులకు పాల్పడుతామని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ ద్వారా ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారు.

Bomb Threat: దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు..
Bomb Threat Emails
Srikar T
| Edited By: |

Updated on: Dec 28, 2023 | 9:33 PM

Share

మన దేశంలో ఈమధ్య బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతోంది. మొన్నటి వరకూ ప్రముఖులకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఈసారి విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఆగంతకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలపై బాంబు దాడులకు పాల్పడుతామని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ ద్వారా ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారు. దేశంలోని ప్రధాన విమానాశ్రయాలైన ఢిల్లీ, జైపూర్, లక్నో, చండీగఢ్, ముంబై, చెన్నై, ఆహ్మదాబాద్ విమానాశ్రయాలను టార్గెట్‎గా చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ బ్లాక్ మెయిలింగ్ సందేశాన్ని సంబంధిత ఎయిర్ పోర్టు అధారిటీకి ఈమెయిల్ ద్వారా పంపించినట్లు వెల్లడించారు అధికారులు. బుధవారం రాత్రి 10.23 గంటలకు ఈ బాంబు బెదిరింపులకు సంబంధించిన మెయిల్ వచ్చినట్లు గుర్తించారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న భద్రతా బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. డాగ్ స్వాడ్, బాంబ్ స్వాడ్ తో పాటు ఇతర పోలీసు బలగాలు బృందాలుగా మారి శోధించారు. ఎయిర్ పోర్టుల్లో పేలుడు పదార్థాలను గుర్తించేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే ఎలాంటి మందు బాంబులు, పేలుడు సామాగ్రి లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అలాగే మెయిల్ వచ్చిన ఐడీని ట్రేస్ చేసి ఎక్కడి నుంచి వచ్చింది అనే సమాచారాన్ని సేకరిస్తున్నారు.

పార్లమెంట్‎లో నిండు సభ జరుగుతున్న సమయంలో దుండగులు పొగ బాంబులు ప్రయోగించడం కలకలం రేగింది. ఆ తరువాత బళ్లారి, కేరళ, ముంబాయి పలు రాష్ట్రాల్లో ఉగ్రమూకలు పాగా వేశారన్న సమాచారంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పలు బృందాలుగా మారి ఉగ్రమూకలను అదుపులోకి తీసుకున్నాయి. అలాగే గత వారం రోజుల క్రితం ముంబాయిలోని పలు ప్రైవేటు బ్యాంకులకు, ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంటిపై బాంబు దాడులు జరుగుతాయని హెచ్చరికలు రావడం ఇవన్నీ దేశ ప్రజల భద్రతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పోలీసులు ప్రత్యేక బృందాలుగా మారి దేశంలోని తాజా పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. నూతన సంవత్సరం వేళ ఇలాంటి బాంబు బెదిరింపులు రావడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ