AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూరగాయల వ్యాపారి అలా చెప్పాడు.. అందుకే అలా చేశానంటున్న బీజేపీ ఎమ్మెల్యే..

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో.. సామాన్య ప్రజానీకానీకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యవసర సరకులతో పాటు.. నిత్యం కూరగాయలు కొనుక్కోవడానికి దాదాపు అంతా మార్కెట్లకు వెళ్లకుండా.. కాలనీల్లోకి వచ్చే కూరగాయల విక్రయాదారులనే సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో యూపీలో కాలనీల్లో తిరిగి అమ్మే విక్రయదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. గత మార్చి నెలలో తబ్లీఘీ జమాత్‌ సమావేశానికి హాజరైన వారిలో కొందరికి కరోనా పాజిటివ్ సోకడం.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ […]

కూరగాయల వ్యాపారి అలా చెప్పాడు.. అందుకే అలా చేశానంటున్న బీజేపీ ఎమ్మెల్యే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 29, 2020 | 6:13 PM

Share

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో.. సామాన్య ప్రజానీకానీకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యవసర సరకులతో పాటు.. నిత్యం కూరగాయలు కొనుక్కోవడానికి దాదాపు అంతా మార్కెట్లకు వెళ్లకుండా.. కాలనీల్లోకి వచ్చే కూరగాయల విక్రయాదారులనే సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో యూపీలో కాలనీల్లో తిరిగి అమ్మే విక్రయదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. గత మార్చి నెలలో తబ్లీఘీ జమాత్‌ సమావేశానికి హాజరైన వారిలో కొందరికి కరోనా పాజిటివ్ సోకడం.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో యూపీలో పలువురు బీజేపీ నేతల తీరు చర్చనీయాంశంగా మారుతోంది. హిందువులు ఎవరు కూడా ముస్లింల వద్ద కూరగాయలు కొనద్దంటూ ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు చేసి 24 గంటలు కూడా గడవకముందే.. లక్నోలో బీజేపీ ఎమ్మెల్యే బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ రాజ్‌పుత్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఓ ముస్లిం కూరగాయల వ్యాపారి వారి కాలనీకి వస్తే. బెదిరించి పంపించేశారు. దీంతో సదరు కూరగాయల వ్యాపారి భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఇదే విషయాన్ని సదరు ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే.. లక్నోలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న సమాచారం ఉందని.. అందుకే ఆ కూరగాయలు అమ్ముతున్న వ్యక్తిని పేరు.. వివరాలు అడిగానంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. సదరు వ్యక్తి ముస్లిం అని.. అయితే హిందూ పేరు చెప్పి కూరగాయలు అమ్ముతున్నారంటూ ఆరోపించారు. అందుకే ఇక్కడి నుంచి పంపించేశానంటూ సమర్ధించుకున్నారు.

కాగా.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం కూడా స్పందించింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. ఇలాంటి ప్రకటనలు చేస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించారు.